logo

‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’

భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ అన్నారు.

Published : 10 May 2024 06:46 IST

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు రాబట్టుకోవడానికే కాంగ్రెస్‌ నేతలు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు అంబేడ్కర్‌ను ఓడించిన కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అంటేనే కుంభకోణాలు, అవినీతి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు సమున్నత స్థానం లభించలేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ విషయంలో భాజపా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు