రోశయ్యతో కర్ణాటకాంధ్రుల బంధం
తెలుగు విజ్ఞాన సమితికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడులకు గవర్నర్గా సేవలు అందించిన కె.రోశయ్యతో అర్ధ శతాబ్ద అనుబంధం ఉందని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు నివాళులర్పించారు. ఈ సమితి ఆధ్వర్యంలోనే 2013లో ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని,
రోశయ్యను సత్కరించి స్మరణిక అందజేసిన నాటి జ్ఞాపకం (దాచినచిత్రం)
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : తెలుగు విజ్ఞాన సమితికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడులకు గవర్నర్గా సేవలు అందించిన కె.రోశయ్యతో అర్ధ శతాబ్ద అనుబంధం ఉందని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు నివాళులర్పించారు. ఈ సమితి ఆధ్వర్యంలోనే 2013లో ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని, అంతకు మునుపు సమితి ఆడిటోరియంలో ఆయనను ఘనంగా సత్కరించామని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రోశయ్యకు సమితి సభ్యులు శనివారం సంతాపసభ ఏర్పాటు చేసి.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తెలుగు భాషపై చక్కని పట్టున్న వ్యక్తిగా, పేరొందిన ఆర్థిక మంత్రిగా, అజాత శత్రువుగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సమితి చేస్తోన్న సేవలు పలుసార్లు ప్రశంసించారని తెలిపారు. రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీ ఒక సీనియరు నాయకుడ్ని కోల్పోయిందని మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో సమితి ప్రతినిధులు కె.గంగరాజు, ఇడమకంటి లక్ష్మీరెడ్డి, వరదరాజు, చంద్రమోహన్ తదితరులున్నారు.
ముఖ్యమంత్రి సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సంతాపాన్ని ప్రకటించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, దక్షత కలిగిన పాలకునిగా అందరికీ ఆయన ఆప్తునిగా ఉన్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి, మాజీ ఎమ్మెల్సీ శరవణ, కర్ణాటక ఆర్య వైశ్యుల సంఘం, సమాఖ్యల ప్రతినిధులు రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ, సంతాపాలను ప్రకటించారు.
బెంగళూరులో నివాళి అర్పిస్తున్న తెలుగు విజ్ఞాన సమితి సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
అ‘ద్వితీయ’ ఫలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM