సమరయోధులకే అగ్రాసనం
బ్రిటిష్ కాలంనాటి రహదారులు, ఆసుపత్రులు, సంస్థలకు స్వాతంత్య్ర పోరాట యోధుల పేర్లు పెడతామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో
సంగొళ్లి రాయణ్ణ విగ్రహం వద్ద బొమ్మై, అశోక్, వాటాళ్ నాగరాజ్, హెచ్.ఎం.రేవణ్ణ తదితరులు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : బ్రిటిష్ కాలంనాటి రహదారులు, ఆసుపత్రులు, సంస్థలకు స్వాతంత్య్ర పోరాట యోధుల పేర్లు పెడతామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో సంగొళ్లి రాయణ్ణ చిత్రపటం ఆవిష్కరించే ఆదేశాలిస్తామని ప్రకటించారు. రాయణ్ణ 191వ వర్ధంతిని పురస్కరించుకుని బెంగళూరు ఖొడేస్ కూడలి వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయణ్ణ దేశభక్తి, స్వామి నిష్ట, ధైర్యం, సాహసం, లక్ష్యం.. ఇవన్నీ యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాయణ్ణ పేరిట 100 ఎకరాల విస్తీర్ణంలో సైనిక పాఠశాల నిర్మాణానికి రూ.55 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలను సైన్యానికి అప్పగిస్తామని చెప్పారు. రాయణ్ణ పుట్టిన సంగొళ్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రాక్ గార్డెన్ నిర్మిస్తున్నామని తెలిపారు. కిత్తూరు రాణిని గుర్తు చేసుకున్న వెంటనే రాయణ్ణ గుర్తుకు వస్తారని చెప్పారు. దిల్లీలో కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహం పక్కనే సంగొళ్లి రాయణ్ణ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి, లోక్సభ సభ్యుడు పి.సి.మోహన్, రెవెన్యూ మంత్రి అశోక్, వేర్వేరు పార్టీల నాయకులు వాటాళ్ నాగరాజ్, హెచ్.ఎం.రేవణ్ణ, హుచ్చప్ప, అధికారులు రాకేశ్ సింగ్, మంజునాథ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం