logo

కైలాసంలో ఉద్యోగాలట!

నిత్యానందస్వామి.. అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త.. తానే నిర్మించుకుని- ప్రకటించుకున్న కైలాస దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట!

Updated : 15 Nov 2022 04:45 IST

నిత్యానంద

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నిత్యానందస్వామి.. అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త.. తానే నిర్మించుకుని- ప్రకటించుకున్న కైలాస దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట! భారతదేశంలోని తమ ప్రతినిధుల సహకారంతో ‘కైలాసం’లో ఉద్యోగాలు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు అంతర్జాలంలో ప్రచారం చేసుకుంటున్నారు. భారతదేశంలోని తమ శాఖల్లో ఒక ఏడాది వేతనంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని- అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసంలో పని చేసేందుకు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటీ విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం తదితరాల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఉచితంగా శిక్షణ పొందుతూనే వేతనాన్ని పొందవచ్చని నిత్యానంద తాను నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. కొద్ది నెలల కిందటే నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమించిందని, శ్రీలంకలో చికిత్సకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా.. నిత్యానంద పేరిట వచ్చిన ప్రకటనలు ఆయన తొలి ఆశ్రమం విస్తరించిన కర్ణాటకలో ఆసక్తిని రేకెత్తించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని