logo

‘అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం’

కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ నుంచి 224 స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.హెచ్‌.లింగేగౌడ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 02:24 IST

మాట్లాడుతున్న కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ ఉపాధ్యక్షుడు లింగేగౌడ

హొసపేటె, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ నుంచి 224 స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.హెచ్‌.లింగేగౌడ పేర్కొన్నారు. ఇప్పటికే 124 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయనగర జిల్లా నుంచి కణదాళు మంజునాథ(విజయనగర), సంతోష్‌ కుమార్‌(హడగలి), ఈడిగర కరిబసప్ప(హరపన హళ్లి) పోటీ చేస్తున్నారని వివరించారు. మరో వంద నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థుల వేటలో ఉన్నామన్నారు. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మినహాయించి ఇతర పార్టీలవారితో పొత్తుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ మూడు పార్టీల్లో స్వార్థపరులు, బంధుప్రీతి ఉన్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రధాన కార్యదర్శి సోమసుందర్‌, ఎస్సీ., ఎస్టీ., విభాగం రాష్ట్రాధ్యక్షుడు చంద్రశేఖర్‌ దొడ్డమని పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని