logo

ప్రతిపక్ష నేతలకు సహనం అవసరం

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను తప్పక అమలు చేస్తుందని, అందుకు కొంత సమయం పడుతుందని అప్పటి వరకు ప్రతిపక్ష నేతలు సహనం పాటించాలని రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడిగి పేర్కొన్నారు.

Published : 30 May 2023 02:47 IST

మంత్రి శివరాజ్‌ తంగడిగి

కన్నడ సంస్కృతిశాఖ మంత్రి శివరాజ్‌ తంగడిగి దంపతులను సత్కరిస్తున్న బోవి గురుపీఠం పీఠాధిపతి ఇమ్మది సిద్ధరామస్వామి తదితరులు

చెళ్లకెరె(చిత్రదుర్గం), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను తప్పక అమలు చేస్తుందని, అందుకు కొంత సమయం పడుతుందని అప్పటి వరకు ప్రతిపక్ష నేతలు సహనం పాటించాలని రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడిగి పేర్కొన్నారు. సోమవారం ఆయన తన భార్యతో కలిసి బోవి గురుపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు ఎంత వరకు నేరవేర్చిందని ప్రశ్నించారు. అంతకు ముందు మంత్రి దంపతులను పీఠాధిపతి ఇమ్మది సిద్ధరామస్వామి శాలువాతో సత్కరించి, సిద్ధరామస్వామి చిత్రపటాన్ని ఇచ్చి అభినందించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని