logo

గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప

శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు.

Published : 29 Mar 2024 03:29 IST

నూతన కార్యాలయంలో ఈశ్వరప్ప, ఇతర నాయకులు

శివమొగ్గ, న్యూస్‌టుడే : శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. నరేంద్రమోదీని మరోసారి ప్రధానిగా చేయాలన్న లక్ష్యంతో పోటీలో నిలిచానని ఆయన పునరుద్ఘాటించారు. మోదీ, వాజ్‌పేయీ ఫొటోలను వేదికపై అలంకరించారు. బ్యానర్‌లో ‘దేశం కోసం మోదీ.. శివమొగ్గకు హిందుత్వవాది’ అనే నినాదాన్ని రాశారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత మోదీ వద్దకు వెళతానని తెలిపారు. తాను నామపత్రాన్ని దాఖలు చేయకుండా పలువురు అడ్డుకుంటున్నారని, వారి ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని