సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉండాలి
సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె
2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ రమాదేవి
ఏన్కూరు, న్యూస్టుడే
సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టిన రమాదేవి గురుకులాలు, ప్రభుత్వ విద్యాలయాలను వేదికగా చేసుకుని స్వశక్తితో ఉద్యోగం సాధించారు. శిక్షణలోనూ 2018 బ్యాచ్లో ఇండోర్ టాపర్, ఆల్రౌండర్గా ముఖ్యమంత్రి పిస్టల్ను బహుమతిగా పొందారు. తాను సన్నద్ధమైన తీరు, అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఆమె మాటల్లోనే..
రెండు ఉద్యోగాలు సాధించా..
చిన్నతనం నుంచి సర్కారు కొలువే లక్ష్యంగా ఉన్న నేను కానిస్టేబుల్, ఎస్సై రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేశా. బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగ ప్రకటన వెలువడింది. పోటీ పరీక్షలకూ కొంత సమయం కేటాయించా. బీటెక్ పరీక్షలు పూర్తయ్యాక రోజుకు 13 గంటలు కష్టపడ్టాను. ఉదయం శారీరక పరీక్షకు, మిగతా సమయం పుస్తకాలు చదివా. గుర్తింపు పొందిన పుస్తకాలను ఎంచుకుని చదివా. తొలుత కానిస్టేబుల్గా నియమితులయ్యా. శిక్షణకు వెళ్లిన కొద్ది రోజులకే ఎస్సై పరీక్ష ఫలితాల్లో కూడా అర్హత సాధించాను.
* ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు తొలుత దేశ, రాష్ట్ర తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. ఆర్థిక పరిస్థితులు, త్రివిధ దళాలు, కరోనాతో ఎగుమతులు, దిగుమతుల పరిస్థితులు? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం? రష్యా- ఉక్రెయిన్ యుద్ధ కారణాలు, యుద్ధం తర్వాత పరిణామాలు.. ఇలా అన్ని అంశాల్లో పట్టు బిగించాలి.
* ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్నకు ఆప్షన్లలో ఒకటి నుంచి మూడు సమాధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలుగుతాం.
* పుస్తకాలు ఎంచుకోవడంతో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మార్కెట్లో దొరికే వాటిల్లో నిపుణులు తయారు చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* మైదానంలో శారీరక దారుఢ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపాలి. 2018లో మహిళా అభ్యర్థులకు 100 మీటర్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం 800 మీటర్లు పరుగెత్తాలి.
‘‘ప్రస్తుత ఉద్యోగ ప్రకటన మంచి అవకాశంగా భావించాలి. సాధించాలనే పట్టుదలతోపాటు ప్రణాళికతో శ్రమిస్తే కచ్చితంగా విజయం సాధిస్తాం. కొలువు సాధించాక శిక్షణలోనూ కష్టపడ్ఢా మా బ్యాచ్లో ఇండోర్, ఆల్రౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాను.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్.. నీరు వృథా
[ 03-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కోర్ట్ ఏరియాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో భారీగా వరద స్థానిక నివాసాల వద్దకు చేరుకుంది. -
కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
[ 03-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎనలేనిది. ఓటు హక్కు పొందడమే కాకుండా వినియోగించుకోవడమూ అత్యంత ప్రధానం. వయోభారం, అంగవైకల్యంతో ఉన్న వారు కొందరు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోతున్నారు. -
గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం
[ 03-05-2024]
పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
[ 03-05-2024]
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. -
ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
[ 03-05-2024]
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
[ 03-05-2024]
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
సౌరమే సౌభాగ్యం
[ 03-05-2024]
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. -
పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి
[ 03-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. -
భానుడి భగభగలతో రెడ్ అలర్ట్
[ 03-05-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష గురువారం తెలిపారు. -
‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
[ 03-05-2024]
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నామా
[ 03-05-2024]
మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
[ 03-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM