నిధులు రూ.6 కోట్లు.. నాణ్యతకు నిలువెల్లా తూట్లు
సింగరేణి ఆధ్వర్యంలో చేపడుతున్న సివిల్ నిర్మాణ పనుల్లో డొల్లతనం కనిపిస్తోంది. నాణ్యతలేమితో చేపడుతున్న నిర్మాణాలు ఎంతకాలం నిలుస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. మణుగూరు ఏరియా పీకేఓసీ గని విస్తరించిన నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న
సింగరేణి ఆధ్వర్యంలో చేపడుతున్న సివిల్ నిర్మాణ పనుల్లో డొల్లతనం కనిపిస్తోంది. నాణ్యతలేమితో చేపడుతున్న నిర్మాణాలు ఎంతకాలం నిలుస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. మణుగూరు ఏరియా పీకేఓసీ గని విస్తరించిన నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని విభాగాల కార్యాలయాలు, వాహనాలు, యంత్రాల షెడ్లను, అల్పాహారశాలను పూర్తిగా తరలిస్తున్నారు. ఇందుకోసం సంస్థ రూ.6 కోట్లు ఖర్చు చేస్తోంది. గొర్రెపేట వాగు సమీపంలో షెడ్ల రూపంలో చేపట్టిన ఈ పనులను గుత్తేదారులు ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. తక్షణం తనిఖీలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అంబేడ్కర్ పార్కు కాంపాండ్ వాల్ నిర్మాణంలో లోపం (ఈ చిత్రం సిమెంట్ మిశ్రమాన్ని పూయక ముందు)
ఏఏ పనులు చేస్తున్నారు?
* బేస్ వర్కుషాపు * రిపేర్ షెల్టర్
* డోజర్ రిపేర్ షెల్టర్* వాటర్ ట్యాంకు * ఈటీపీ* సబ్ స్టేషన్
* ఫిల్టర్ బెడ్ * వాషింగ్ ప్లాట్ఫాం
* అల్పాహారశాల * విశ్రాంతి గది
* మ్యాన్వే * డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు
* మేనేజర్ కారాలయం
* సేఫ్టీ కార్యాలయం
* అంబేడ్కర్ పార్కు కాంపాండ్ వాల్ నిర్మాణం: రూ.15 లక్షలు
ఇలా సాగుతున్నాయి
* పీకేఓసీ నూతన భవనాల నిర్మాణానికి వినియోగించే ఇటుకలు అధ్వానంగా ఉన్నాయి. అవి నాణ్యతగా లేకపోవటంతో ముక్కలు అవుతున్నాయి.
* పనుల్లో సిమెంటును తక్కువగా వినియోగిస్తున్నారు. సిమెంటు కన్నా ఇసుకను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో గోడలు ఏ మాత్రం గట్టిగా ఉండటం లేదు.
* గోదావరి ఇసుక స్థానంలో పరిసర ప్రాంతాల వాగుల్లో లభించే దుబ్బ ఇసుకను వాడుతున్నారు. నిర్మించిన భవనాలకు క్యూరింగ్ లేదు.
కాంపౌండ్ వాల్ నిర్మాణమూ..
చిన్న పనుల్లోనూ నాణ్యత ఉండటం లేదు. రూ.15 లక్షలతో చేపట్టిన పీవీ కాలనీలోని అంబేడ్కర్ పార్కు కాంపౌండ్ వాల్ గోడ పెచ్చుపెచ్చులుగా ఊడిపోతోంది. దీంతో సదరు గుత్తేదారు పెచ్చులు లేచిన ప్రదేశంలో మళ్లీ సిమెంటు మిశ్రమాన్ని పూసి సరిచేస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యతా లోపంపై కార్మిక సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేశారు.
పర్యవేక్షణ అంతంతే..
సింగరేణిలో ప్రతి సివిల్ పనుల్లో అధికారులు పర్యవేక్షణ ఉండాలి. ఎక్కడా అలా జరగటం లేదు. గనిలో చేపట్టే సివిల్ పనులు ఎంతో నాణ్యతగా ఉంటాయనేది కార్మికుల అభిప్రాయం. కానీ ప్రస్తుతం పనులు అందుకు విరుద్ధంగా ఉండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
‘‘నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ జరుగుతుంది. గోదావరి ఇసుకనే వినియోగిస్తున్నారు. అన్నీ పరీక్షించాకనే అనుమతులు ఇస్తున్నాం. క్యూరింగ్కి పైపులైన్లు వేశారు. పార్కు బేస్మెంట్ నిర్మాణంలో షట్టర్లు వినియోగిస్తారు. అవి తీసిన సమయంలో పెచ్చులు కనిపిస్తాయి.’’
వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు