సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది.
కొత్తగూడెం, న్యూస్టుడే : ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. ఆశావహులు కేడర్ మద్దతు కూడగట్టుకోవడం ద్వారా పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడాలి. అలా చేయగలిగితేనే అభ్యర్థిత్వం రేసులో నిలిచేది. లేదంటే పోటీలో వెనకబడటం ఖాయం. ఇక, అధికార పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ప్రయత్నమూ ఖరీదుతో కూడుకున్నదై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీలూ దీటుగా నిలిచే అభ్యర్థిని అన్వేషించడం సహజం. ఈ క్రమంలోనే జనాదరణ కలిగి, గెలుపు అవకాశాలు కాస్తోకూస్తో ఉన్న ఏ పార్టీ అయినా అంగ, అర్థబలమే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లందరిలోనూ ఇంచుమించు ఇదే అభిప్రాయం స్థిరపడిపోయింది. ఈ క్రమంలో ఎన్నికలేవైనా, ‘అభ్యర్థులు ఆర్థికంగా ఎంత గట్టివారు? అనే అంశమే తొలుత చర్చకు తావిస్తుంది. ఆ తర్వాతే వారికి జనంలో ఆదరణ, పాలన అనుభవం, కుటుంబ నేపథ్యం వగైరాలు కారణంగా నిలుస్తున్నాయి’ అని వివిధ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ విషయంలో ఖమ్మం లోక్సభ స్థానానికి సైతం ఎంతమాత్రం మినహాయింపు లేదు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు గత ఎన్నికల్లో కోటీశ్వరులనే బరిలోకి నింపడం విశేషం. 2004 నుంచి పరిశీలిస్తే దాదాపు అన్నిసార్లు విజేతలుగా వారే నిలిచారు. సమీప ప్రత్యర్థులూ కరోడ్పతులే. తాజా ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. భాజపా: రూ.16.25 కోట్లు, భారాస: రూ.155.90, కాంగ్రెస్: రూ.58.27 కోట్ల ఆస్తులను చూపారు. ఈసారీ విజయం ఓ కోటీశ్వరుడినే వరించనుండటం విశేషం.
‘ఖమ్మం’ స్థానం వాటా..
- 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మొత్తం 430 మంది తమ అఫిడవిట్లలో కోటికి పైగా ఆస్తులున్నట్టు చూపారు. వారిలో విజేతలుగా నిలిచినవారు.. 153 (30%) మంది. ఖమ్మం లోక్సభ నుంచి గెలిచిన అభ్యర్థి వీరిలో ఒకరు.
- 2009 సార్వత్రిక సమరాన్ని పరిశీలిస్తే.. బరిలో నిలిచిన కోటీశ్వరులు 1,203 మంది. విజేతల్లోనూ వీరి వాటా 302 (58%). అంటే సగానికి పైగా. ఖమ్మం స్థానాన్ని పరిశీలిస్తే.. విజేత, ప్రత్యర్థి కోట్ల ఆస్తులు చూపారు. ఓ ఇండిపెండెంట్ సైతం రూ.4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు.
- మునుపటి రెండు ఎన్నికలతో పోల్చిచూస్తే.. 2014లో ఎక్కువ మంది కోటీశ్వరులు లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. 2,216 (27%) మంది పలు పార్టీల తరఫున పోటీపడగా, వీరిలో అత్యధిక మంది 442 (82%) విజయం సాధించటం విశేషం. ఖమ్మం లోక్సభ స్థానాన్ని పరిశీలిస్తే, విజేత, సమీప ప్రత్యర్థి ఇద్దరూ రూ.కోట్లలో ఆస్తులు చూపినవారే. వీరు కాకుండా తెరాస, సీపీఐతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి రూ.కోటికి పైగా ఆస్తులు చూపటం విశేషం.
- 2019 లోక్సభ ఎన్నికల బరిలో అత్యధికంగా 2,301 మంది (29%) కోటీశ్వరులు అభ్యర్థులుగా నిలిచారు. వీరిలో 88% మంది, అంటే 454 మంది విజేతలుగా నిలిచారు. ఖమ్మం స్థానానికి చెందినవారు (విజేత సహా) ఏకంగా అయిదుగురు (భారాస, కాంగ్రెస్, భాజపా, పిరమిడ్ పార్టీ, స్వతంత్ర) అభ్యర్థులు కోటీశ్వరులే కావటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
[ 08-05-2024]
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. -
రక్తహీనత.. బాదితులకు చేయూతÅ
[ 08-05-2024]
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఖమ్మంలో కమల వికాసం ఖాయం
[ 08-05-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. -
సత్వర న్యాయమే ప్రథమ ప్రాధాన్యం: జిల్లా జడ్జి
[ 08-05-2024]
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. -
ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
[ 08-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు
[ 08-05-2024]
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
భారాస విజయమే లక్ష్యంగా పనిచేయండి: నామా
[ 08-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కవిత
[ 08-05-2024]
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. దాస్తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్దేవ్
[ 08-05-2024]
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ అన్నారు. భాజపా లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం
[ 08-05-2024]
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్