కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడ్లగూడెంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, వేదికపై మంత్రి పొంగులేటి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె తదితరులు
అశ్వారావుపేట, దమ్మపేట, న్యూస్టుడే: భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ ఆఖరికి రాముడినీ ఎన్నికల అంశంగా మార్చారని విమర్శించారు. వడ్లగూడెంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తుందని సర్వే నివేదికలు చెబుతుండటంతో మోదీకి ఏంచేయాలో తెలియక దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, సీఎం రేవంత్రెడ్డి మాట ఇస్తే వెనక్కు తగ్గబోరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించి పార్లమెంట్కు పంపితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారాస పాలనలో రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్లు అప్పుల పాలుచేశారని, రూ.1.50 లక్షల కోట్లను నీటిపారుదల, ఇతర అభివృద్ధి పనుల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో కొత్త కొలువులు రాలేదని, ఉన్న ఉద్యోగాలు పోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసిన ఘనత భాజపాకే దక్కిందని విమర్శించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మువ్వా విజయబాబు, ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పకడ్బందీ శిక్షణ.. ప్రజాస్వామ్యానికి రక్షణ
[ 07-05-2024]
సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది. -
గృహమే కదా పోలింగ్ కేంద్రం!
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
[ 07-05-2024]
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ముదిగొండలో సోమవారం ప్రచారం నిర్వహించారు. -
కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడం: భట్టి
[ 07-05-2024]
కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
ప్రత్యేక బోధనతోనే అనుత్తీర్ణులు గట్టేక్కేది!
[ 07-05-2024]
ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. -
కేంద్ర హోంమంత్రిపై ఆరోపణలు చేశారని.. సీఎం రేవంత్రెడ్డిపై భాజపా ఫిర్యాదు
[ 07-05-2024]
కొత్తగూడెంలో ఈ నెల 4న నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి భాజపాపై అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్, ఒకటో పట్టణ సీఐ కరుణాకర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. -
అంతా.. పోలింగ్ కేంద్రాలకు కదలాలంటే...!
[ 07-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం బయట తిరగలేని పరిస్థితి. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యమే. 2019లో పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీనే జరిగింది. -
శాసనసభ ఎన్నికల ఫలితాలే పునరావృతం
[ 07-05-2024]
కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. -
నమూనా కేంద్రం.. ఆకర్షణీయం
[ 07-05-2024]
ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఎంపిక చేశారు.