కానిస్టేబుల్నంటూ వసూళ్లు
ఫాస్ట్ఫుడ్ సెంటర్ల యజమానుల ఫోన్ నంబర్లు సేకరించి, తాను కానిస్టేబుల్నంటూ వారి నుంచి నగదు డిమాండ్ చేస్తున్న వ్యక్తి గురించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే లక్ష్యం
ముదిగొండ, న్యూస్టుడే: ఫాస్ట్ఫుడ్ సెంటర్ల యజమానుల ఫోన్ నంబర్లు సేకరించి, తాను కానిస్టేబుల్నంటూ వారి నుంచి నగదు డిమాండ్ చేస్తున్న వ్యక్తి గురించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ముదిగొండలోని ఓ ఫాస్ట్ఫుడ్ దుకాణ యజమానికి ఈ నెల 4న ఓ వ్యక్తి కానిస్టేబుల్ను అంటూ ఫోన్ చేశాడు. మీ దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. ఈ నెల 2న సూర్యాపేటకు చెందిన వారు మూడు ఎగ్ ఫ్రైడ్రైస్ పార్సిల్ తీసుకువెళ్లారని అవి తినడంతో ఒక బాలుడికి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పాడు. విషయం ఫుడ్ ఇన్స్పెక్టర్, పోలీసులకు తెలిస్తే కేసులు అవుతాయని బెదిరించాడు. వాళ్లతో మాట్లాడి సెటిల్ చేస్తానని తనకు రూ.2 వేలు ఇవ్వాలని దుకాణ యజమానికి ఫోన్లో డిమాండ్ చేశాడు. దుకాణ యజమాని గట్టిగా ప్రశ్నించడంతో సదరు వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఇటీవల ఖమ్మంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ యజమానికి సైతం ఇదే తరహాలో ఫోన్ చేసి కొంత మొత్తంలో నగదు తీసుకున్నట్లు తెలిసింది. ఎస్బీ అధికారులు మంగళవారం ముదిగొండలో ఫాస్ట్ఫుడ్ కేంద్రం యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ నేరగాడా? పోలీస్ కానిస్టేబులా అనేది పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తే తెలిసే అవకాశం ఉంది.
డెంగీతో బాలుని మృతి
పాల్వంచ (జగన్నాథపురం), న్యూస్టుడే: నాగారం కాలనీకి చెందిన ఓ బాలుడు(6) డెంగీతో పోరాడుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బాలునికి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ దగ్గర వైద్యం చేయించారు. ఆదివారం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం ఖమ్మం తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల క్రితమే పెద్ద కుమారుడు చనిపోయిన బాధను మరిచిపోకముందే మరో కుమారుణ్ని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమారుడు లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వారు రోదిస్తున్న తీరు పలువురిని కదిలించింది.
మాయమాటలతో పాస్టర్ ప్రేమాయణం!
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో మొదలైన పాస్టర్ వ్యవహారం.. ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా తలెత్తిన వివాదానికి గన్నవరంలో అడ్డుకట్ట పడింది. పోలీసుల, బాధితుల కథనం ప్రకారం.. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన కల్యాణి నాగేశ్వరరావు.. ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీఆర్ కాలనీలో చర్చి పాస్టర్గా జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం స్థానికంగా చర్చి ఏర్పాటు చేసిన అతనికి అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆరోగ్యం బాగాలేదని ఓసారి పాస్టర్ వద్దకు సదరు బాలిక వెళ్లింది. ప్రత్యేక ప్రార్థన చేస్తే తగ్గిపోతుందంటూ ఆమెకు దగ్గరయ్యాడు. పాస్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు గన్నవరం మండలం ముస్తాబాదలోని బంధువుల ఇంటికి ఆమెను పంపించారు. ఈ నెల 2న సదరు బాలిక బంధువుల ఇంటినుంచి అదృశ్యం కావటంతో గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలిక పాస్టర్తో కలిసి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ప్రార్థÄనల నిమిత్తం మాత్రమే తాము వెళ్లినట్లు బాలిక, పాస్టర్ చెబుతున్నారని సీఐ సత్యనారాయణ తెలిపారు. మరోవైపు అనారోగ్య కారణాలతో భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న నాగేశ్వరరావు.. మాయమాటలతో తమ కూతుర్ని ఎత్తుకెళ్లి వేధిస్తున్నాడని, పొక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆలయ భూముల ఆక్రమణపై ఫిర్యాదు
భద్రాచలం, న్యూస్టుడే: పురుషోత్తపట్నంలోని భద్రాచలం ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదని ఎటపాక అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గోశాల సమీపంలో పదుల సంఖ్యలో కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. తాత్కాలిక ఆవాసాల స్థానంలో శాశ్వతంగా ఉండేందుకు గృహాలను నిర్మిస్తున్నారు. జగదీశ్కాలనీ శివారులోను ఇదే తరహాలో దేవుడి మాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించినా రామాలయం సిబ్బంది సరైన విధంగా స్పందించకపోవడంతో ఆక్రమణలు ఆగడం లేదని భావిస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవుడి జాగా వివాదాల్లో ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ కమిషనర్ ఇటువైపు తిరిగి చూడకపోవడం ఈ శాఖ తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని భక్తులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!