సాయం పేరుతో సహజీవనం
భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ఆమె ప్రాణాలు తీయడంతోపాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది
ప్రత్యర్థితో చేతులు కలిపి ప్రియురాలిని అంతమొందించాడు
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నిందితులను చూపుతున్న పోలీసులు
చింతలపూడి, న్యూస్టుడే: భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ఆమె ప్రాణాలు తీయడంతోపాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది. చింతలపూడిలో ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతలపూడి నగర పంచాయతీలోని ఎస్బీఐ నగర్కు చెందిన ఓ మహిళ(37) భర్త 2015లో చనిపోయారు. అప్పటి నుంచి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆమె స్థానికంగా ఉన్న అత్తారింట్లో ఉంటున్నారు. సత్తుపల్లి మండలం గంగారంలో ఉన్న సుమారు అరెకరం భూమి విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో మహిళకు కొంతకాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె 2016లో కోర్ట్టులో దావా వేశారు. మూడేళ్ల క్రితం చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె రాంబాబుతో పరిచయం ఏర్పడింది. భూమి విషయంలో సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. భూవివాదం ఎంతకీ తేలకపోవడంతో నంబూరి శ్రీనివాసరావు, బర్రె రాంబాబు ఒక్కటయ్యారు. మహిళను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా జనవరి 19న మహిళను రాంబాబు అద్దె కారులో ఎక్కించుకొని కాకినాడ సర్పవరం జంక్షన్లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాడ్తో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయారు. జనవరి 21న తెల్లవారుజామున మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని దమ్మపేట మండలం ఆర్లపెంట శివారులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అదే రోజు మహిళ సోదరుడితో కలిసి చింతలపూడి ఠాణాకు వెళ్లి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానిస్తున్నారనే భయంతో హైదరాబాద్ పారిపోయాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై హరికృష్ణ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ వెళ్లి గాలించి నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బర్రె రాంబాబు, నంబూరి శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.