కదులుతున్న రైలు ఎక్కబోయి మహిళకు తీవ్ర గాయాలు
కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. స్పందించిన ప్రయాణికులు రైలు కోచ్ను కొంచెం వెనక్కి నెట్టి పట్టాలు, ప్లాట్ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు లాగారు.
గాయపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ శివాని
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. స్పందించిన ప్రయాణికులు రైలు కోచ్ను కొంచెం వెనక్కి నెట్టి పట్టాలు, ప్లాట్ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు లాగారు. అంబులెన్స్ రాకపోయినా రైల్వే పోలీసుల సహకారంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఈ ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటుచేసుకుంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర బంజారాకాలనీకి చెందిన కలసాని నాగేశ్వరరావు మధిర రైల్వేస్టేషన్లో ట్రాక్మెన్గా పని చేస్తున్నారు. భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ఖమ్మం వచ్చారు. పెద్ద కుమారుడికి గవద బిళ్లలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి మధిరకు వెళ్లేందుకు ఖమ్మం రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులోకి భర్త నాగేశ్వరరావు, పిల్లలు ఎక్కారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు రైలు ముందుకు కదలడంతో కృష్ణవేణి కంగారుగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో కాలు జారిపోయి ప్లాట్ఫాం, రైలు మెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తక్షణమే స్పందించిన రైల్వే అధికారులు కొద్దిసేపు రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కృష్ణవేణిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సుమారు 100-150 ప్రయాణికులు రైలు బోగిని వెనక్కి నెట్టడంతో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ శివాని క్షతగాత్రురాలిని బయటకు లాగారు. అంబులెన్స్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుల్స్ శివాని, ఎస్కే అజీజ్ సహకారంతో ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్రావు, హెడ్కానిస్టేబుల్ ఆళ్ల సత్యనారాయణరెడ్డి ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం కృష్ణవేణి ఆర్యోగం నిలకడగా ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రయాణికుల ఆందోళన
మహిళకు ప్రమాదం జరగడంతో స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళన చేశారు. రైల్వేస్టేషన్ మేనేజర్ కార్యాలయానికి చేరుకొని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కేందుకు సమయం పడుతుందని, రైలును ఎక్కువ సమయం ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు. రైలు ఎక్కువ సమయం నిలిపే అధికారం తమకు లేదని, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రైళ్ల రాకపోకలు ఎప్పటికప్పుడు జరుగుతాయని స్టేషన్ మేనేజర్ జీఎన్వీ ప్రసాద్, ఆర్పీఎఫ్ సీఐ ఎం.శ్రీనివాస్రెడ్డి, అధికారులు సర్ది చెప్పడంతో శాంతించారు. నెక్కొండ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం సైతం పలు రైళ్లు రద్దవడంతో పాటు ఆలస్యంగా రావడంతో ఖమ్మం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. రోజువారీ రైళ్లు సమయానికి రాకపోవడం, 11:30 గంటలకు రావాల్సిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం 3:00 గంటలకు రావడంతో ఒక్కసారి ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఎగబడాల్సిన పరిస్థితి ఎదురైంది. సహాయక చర్యల్లో ఆర్పీఎఫ్ సీఐ ఎం.శ్రీనివాస్రెడ్డి, ఏఎస్సై ప్రసన్నకుమార్, మహిళా కానిస్టేబుల్ శివాని, కానిస్టేబుల్ ప్రదీప్, జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్రావు, హెడ్కానిస్టేబుల్ ఎ.సత్యనారాయణరెడ్డి, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.