శాసనసభ వయా జిల్లా పరిషత్
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలపై జడ్పీ ఛైర్మన్ల గురి
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మధిర నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా లింగాల కమల్రాజ్, ఇల్లెందు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వీరు ఇదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. జడ్పీ ఛైర్మన్లుగా వీరికి పదవీకాలం మరికొన్ని నెలలు ఉన్నప్పటికీ చట్ట సభల్లో ప్రవేశించాలనే ఆసక్తితో వారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు.
జలగం వెంగళరావు...
ఖమ్మం తొలి జిల్లా పరిషత్ ఛైర్మన్గా జలగం వెంగళరావు 1959 నుంచి 1964 వరకు పని చేశారు. ఆ తర్వాత ఆయన వేంసూరు నియోజకవర్గం నుంచి 1962, 1967, 1972, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1973లో ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 1984, 1989 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా కూడా పని చేశారు.
- 1978లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూనెం రామచంద్రయ్య ఆ తర్వాత 1983 నుంచి 1987 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు.
- ఖమ్మం జిల్లాలో గతంలో పలువురు జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా చేసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, మరి కొంతమంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జడ్పీ ఛైర్మన్లుగా పని చేశారు.
జలగం కొండలరావు
1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1964 నుంచి 1970 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 1977, 1980లలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
- 1957లో భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.వాణీరమణారావు ఆ తర్వాత 1981 నుంచి 1982 వరకు ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు.
- 1972, 1975లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికైన చేకూరి కాశయ్య 1987 నుంచి 1992 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు.
- 1985లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేసిన చందా లింగయ్య 2001 నుంచి 2005 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!