నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి.
వైద్య పరీక్షల నివేదిక చూపుతున్న లలితకుమారి
మధిర గ్రామీణం, న్యూస్టుడే: నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. రెండో కూతురు వెన్నుముక దెబ్బతిని మంచానికే పరిమితమైంది. పెద్ద కూతురు మరణం, ఆ తర్వాత తండ్రి దూరమవడంతో దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇరవై ఎనిమిదేళ్లు వచ్చినా కుమార్తెకు ఆ తల్లి అన్నీ తానవుతోంది. పోషణ భారమై వైద్య ఖర్చులకు చిల్లిగవ్వ లేక దాతల సహాయం అర్థిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..
మధిర మండలం మాటూరుపేట గ్రామంలో పాగొల్లు నాగేశ్వరరావు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కూతురు వివాహం అయిన కొద్ది కాలానికే మృతి చెందింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం నాగేశ్వరరావు తన కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. రెండో కుమార్తె లలితకుమారి అనారోగ్యం బారిన పడటంతో మూడో కుమార్తెకు వివాహం జరిపించారు. మూడేళ్ల క్రితం నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో హైదరాబాద్లో కుటుంబ పోషణ భారమై లక్ష్మీకాంతమ్మ, తన కుమార్తె లలితకుమారితో కలిసి మాటూరుపేటకు వచ్చింది. ఆ తర్వాత లలితకుమారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీరం మొత్తం వాపు వచ్చి మంచానికే పరిమితం కావడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించి వైద్య సేవలు అందించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెన్నుముక దెబ్బతిందని, శస్త్రచికిత్స చేస్తే నయం అవుతుందని తెలిపారు. కనీసం లేచి నిలబడలేని పరిస్థితి. కుర్చీలో కూర్చోవడానికి సైతం అవస్థలు పడుతోంది. కుమార్తె మంచాన పడటంతో తల్లి కూలీ పనులకు వెళ్తూ సపర్యలు చేస్తోంది.
రేషన్ కార్డులేక.. చికిత్స చేయించలేక
గతంతో వారికి హైదరాబాద్లో రేషన్ కార్డు ఉండగా మాటూరుపేట వచ్చిన తరువాత రద్దయింది. రేషన్కార్డు లేకపోవటంతో చికిత్స చేయించలేని పరిస్థితి ఏర్పడుతోందని తల్లి వాపోయింది. ఆపరేషన్కు రూ.5లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రెక్కల కష్టమ్మీద ఆధారపడిన తమకు కుటుంబం గడవటమే కష్టంగా ఉందని, అంత ఖర్చు చేసి శస్త్రచికిత్స ఎలా చేయించాలని తల్లీకూతుళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చులకు రూ.50వేలు అప్పు చేశామని, కనీసం వాటిని తీర్చలేని దుస్థితిలో ఉన్నామని, దాతలు స్పందించి తమను ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రేషన్కార్డు, లలితకుమారికి ఆసరా పింఛను ఇప్పించాలని వారు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు