logo

అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా,  మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను,  సీఐ కరుణాకర్,  కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 02 May 2024 11:55 IST

ఇల్లందు గ్రామీణం : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా,  మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను,  సీఐ కరుణాకర్,  కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ  బాధ్యతగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. పోలీసు యంత్రాంగం ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు  ఉన్న ప్రాధాన్యత వివరిస్తూ..  ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని ఓటర్లకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు