జిల్లాలో వర్షం
నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి.
వైరా మండలం సిరిపురంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు
ఖమ్మం నగరం, న్యూస్టుడే: నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన వివరాల మేరకు... వేంసూరులో 24.3 మి.మీ. వర్షం కురిసింది. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 14.0, పెనుబల్లి మండలం గౌరారంలో 8.5, ఎర్రుపాలెంలో 11.8, మధిర ఏఆర్ఎస్లో 7.5, ఏన్కూరులో 3.8, తల్లాడ, వైరా, చింతకాని, కల్లూరులో 0.5, పెనుబల్లిలో 8మి.మీ. వర్షపాతం నమోదైంది.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఖమ్మం రోటరీనగర్: ఈదురుగాలులకు వివిధ మండలాల్లో విద్యుత్తు సరఫరాకు మంగళవారం సాయంత్రం అంతరాయం కలిగిందని టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఎ.సురేందర్ తెలిపారు. ప్రధానంగా కామేపల్లి, ఖమ్మం గ్రామీణం, బోనకల్లు, మధిర, పెనుబల్లి మండలాల్లో గాలుల తీవ్రత అధిక నష్టం కలిగించిందన్నారు. స్తంభాలు పడిపోవడం, చెట్లకొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపోయాయని చెప్పారు. రెండు రోజులుగా వీస్తున్న బలమైన గాలులకు జిల్లాలో ఇప్పటివరకు 309 స్తంభాలు, తొమ్మిది నియంత్రికలు పడిపోయాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు