విద్యా కానుక.. కటకట
జిల్లాకు పూర్తి స్థాయిలో చేరని కానుకలు
5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సమదుస్తుల కోసం విద్యార్థుల నిరీక్షణ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: మరో మూడ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇప్పటి వరకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో రాలేదు. ఎమ్మార్సీ భవనాలకు వచ్చిన కానుకల్లో అరకొర వస్తువులు ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లా ఆదోనిలో 5వ తేదీన విద్యా కానుక పంపిణీ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారు. కిట్లు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పాఠ్య పుస్తకాల ఊసే లేదు●
ఉమ్మడి జిల్లాలో ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ, ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు, ఎయిడెడ్ తదితర పాఠశాలలు కలిపి 3,034 వరకు ఉన్నాయి. మొత్తం 1,83,623 కిట్లు రావాల్సి ఉంది. ఆయా విద్యాలయాలకు ఈనెల 2 నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు కానుకలు సంపూర్ణంగా రాలేదు. విద్యా కానుక కిట్టులో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు జతల దుస్తులు, బ్యాగు, బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, నిఘంటువు అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రాత పుస్తకాలే పూర్తిస్థాయిలో వచ్చాయి. వర్క్ బుక్కులు రాలేదు. పాఠ్య పుస్తకాల ఊసే లేదు.
త్వరలో పంపిణీ చేస్తాం - రంగారెడ్డి, డీఈవో, కర్నూలు
విద్యా కానుకలు త్వరలో పంపిణీ చేస్తాం. కొన్ని కిట్లు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. త్వరలో అన్నీ వస్తాయి. పూర్తి వివరాలు సమగ్ర శిక్ష అభియాన్ వారి ద్వారానే తెలియాల్సి ఉంది. వారే సరఫరా చేస్తున్నారు.
ఆదోనిలో అధికారుల తలమునకలు
ఆదోని పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలు అందించనున్నారు. సీఎం వస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ కానుకలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మొత్తం 1,605 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం నాటికి ఈ కానుకలకు సంబంధించి దుస్తులు, బూట్లు, రాత పుస్తకాలు, నిఘంటువు, బెల్టులు పూర్తి స్థాయిలో రాగా.. బ్యాగులు, పదో తరగతి విద్యార్థులకు దుస్తులు రావాల్సి ఉంది. టెస్టు పుస్తకాలు 50 శాతం వరకు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రానున్న నేపధ్యంలో పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో కానుకలు అందేలా చర్యలు చేపట్టారు. ఏ విద్యార్థికి కొరత లేకుండా చూడాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు కొత్త దుస్తులు కుట్టించుకురావాలంటూ పాఠశాల నిర్వాహకులు ఒక జత దుస్తులు విద్యార్థులకు అందించారు. - న్యూస్టుడే, ఆదోని విద్య
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
-
Movies News
F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
-
World News
Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
-
Sports News
IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్పై రికీ పాంటింగ్ జోస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!