ముఖ్యమంత్రి పర్యటనలో మార్పు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30న జిల్లాలో పర్యటించాల్సి ఉండగా జూన్ ఒకటో తేదీకి కార్యక్రమం మారిందని కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30న జిల్లాలో పర్యటించాల్సి ఉండగా జూన్ ఒకటో తేదీకి కార్యక్రమం మారిందని కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాలతో ఈ మార్పు జరిగిందని ఆమె చెప్పారు.
చురుగ్గా ఏర్పాట్లు
పత్తికొండ గ్రామీణం, పత్తికొండ పట్టణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి పర్యటన సమీపిస్తుండటంతో పనుల్లో వేగం పుంజుకుంది. కలెక్టర్ డా.సృజన ఆయా శాఖల ముఖ్య అధికారులతో కలిసి ఆదివారం మరోసారి ఏర్పాట్లు పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పత్తికొండ తహసీల్దారు కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో జేసీ మౌర్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ పనులు, సభాస్థలి వద్ద వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆమె వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎస్పీ కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్కుమార్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్