Chandrababu: రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
ఆలూరు: ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని జగన్..రూ.13లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. తెచ్చారా? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే.. స్థానిక సంస్థలకు ప్రాధాన్యమిస్తామని, గ్రామాల్లో సర్పంచ్లకే అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరమన్నారు.
‘‘వైకాపా పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా? విద్యపై పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఫలితాలేంటి? వైకాపా నేతలు దోచింది ఎంత? దాదుచుకున్నది ఎంత? రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్. ఇష్టానుసారం భూములు దోచుకున్నారు. జగన్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉందా? రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!