logo

ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్‌బాబు తెలిపారు.

Updated : 26 Apr 2024 10:48 IST

సున్నిపెంట సర్కిల్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్‌బాబు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ ఆధ్వర్యంలో శ్రీశైలం మండలంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. బస్టాండ్‌ సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, మార్కెట్‌, ఆశ్రమం, అక్కమ్మ సెంటర్‌ మీదుగా తిరిగి బస్టాండ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గంగయ్య యాదవ్‌, రెండో పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని