సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది.
శతకంతో చెలరేగిన సూర్య కుమార్
ముంబయి ఘనవిజయం
ముంబయి
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. బంతితో విజృంభించి, బ్యాటుతో చెలరేగిన ముంబయి ఇండియన్స్.. సన్రైజర్స్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విధ్వంసక బ్యాటింగ్తో ఒక దశలో ప్రత్యర్థి జట్లన్నింటినీ వణికించి, ఆపై గాడి తప్పిన సన్రైజర్స్ బ్యాటర్లు.. మరోసారి తేలిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
ప్లేఆఫ్స్ రేసులో ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో సన్రైజర్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం వాంఖడేలో హైదరాబాద్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 16 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ (102 నాటౌట్; 51 బంతుల్లో 12×4, 6×4) మెరుపు శతకంతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. తిలక్ వర్మ (37 నాటౌట్; 32 బంతుల్లో 6×4) అతడికి సహకారమందించాడు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ (1/22) ఆకట్టుకున్నాడు. మొదట హైదరాబాద్ 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో 7×4, 1×6), ప్యాట్ కమిన్స్ (35 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. పియూష్ చావ్లా (3/33), హార్దిక్ పాండ్య (3/31) ఆ జట్టును దెబ్బ తీశారు. 12 మ్యాచ్ల్లో సన్రైజర్స్కిది ఆరో ఓటమి.
అలా మొదలై..: ముంబయి ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఆ జట్టు చిత్తుగా ఓడిపోతుందనే అనిపించి ఉంటుంది ఎవ్వరికైనా. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4) పేలవ ఫామ్ను కొనసాగించగా.. మూడో స్థానంలో వచ్చిన నమన్ ధీర్ (0) కూడా తేలిపోయాడు. ఇషాన్ను యాన్సెన్, రోహిత్ను కమిన్స్ పెవిలియన్ చేర్చారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మెయిడెన్ వేసిన భువి.. అయిదో ఓవర్లో ధీర్ను ఔట్ చేశాడు. 5 ఓవర్లకు 36/3తో ముంబయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఆత్మరక్షణకు పోకుండా.. ఎదురుదాడి చేసిన సూర్యకుమార్ నిమిషాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. చూస్తుండగానే స్కోరు బోర్డు రాకెట్ వేగాన్నందుకుంది. మరో ఎండ్లో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ సహకరిస్తుంటే.. సూర్య చెలరేగిపోయాడు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లందరి గణాంకాలను అతను మార్చేశాడు. యాన్సెన్ వేసిన ఏడో ఓవర్లో సూర్య రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో 22 పరుగులొచ్చాయి. 30 బంతుల్లో అర్ధశతకం సాధించిన సూర్య.. ఆపై టాప్ గేర్లోకి వెళ్లిపోవడంతో ముంబయికి ఎదురు లేకపోయింది. వికెట్టూ పడక, పరుగులూ ఆగక సన్రైజర్స్ ఓటమికి చేరువైంది. ముంబయి విజయానికి 6 పరుగులు అవసరమైన స్థితిలో 96పై నిలిచిన సూర్య.. సిక్స్ కొట్టి శతకం పూర్తి చేయడంతో పాటు మ్యాచ్ను ముగించాడు.
మొదట హెడ్.. ఆఖర్లో కమిన్స్: మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏ దశలోనూ సౌకర్యవంతంగా కనిపించకపోయినా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా.. మొదట్లో హెడ్, చివర్లో కమిన్స్ ధాటిగా ఆడి జట్టుకు పోరాడే స్కోరునందించారు. సీజన్ ఆరంభంలో మెరుపు ఆరంభాలందించి.. ఆ తర్వాత లయ తప్పిన హెడ్, అభిషేక్ జోడీ ఈ మ్యాచ్లో కూడా తడబడింది. మొదట్లో హెడ్ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగానే ఆడాడు. అభిషేక్ ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతణ్ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే హెడ్ను అరంగేట్ర బౌలర్ కాంబోజ్ ఔట్ చేశాడు. కానీ అది నోబాల్ కావడంతో హెడ్ బతికిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న హెడ్ ధాటిగా స్కోరు పెంచాడు. కాంబోజ్ బౌలింగ్లోనే హెడ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తుషార చేజార్చినా.. కాసేపటికే హెడ్ను చావ్లా ఔట్ చేసి ముంబయికి ఉపశమనాన్నిచ్చాడు. అంతకంటే ముందు మయాంక్ (5)ను కాంబోజ్ బౌల్డ్ చేశాడు. సీజన్ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసి హెడ్ తుది జట్టులోకి వచ్చాక జట్టులో చోటు కోల్పోయిన మయాంక్.. ఈ మ్యాచ్తో మళ్లీ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హెడ్ ఔటయ్యాక వికెట్ల పతనం ఊపందుకుంది. ఓ ఎండ్లో హార్దిక్.. మరో ఎండ్లో చావ్లా వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. నితీశ్ (20)తో పాటు యాన్సెన్ (17), షాబాజ్ (10)లను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. ప్రమాదకర క్లాసెన్ (2)ను చావ్లా బౌల్డ్ చేశాడు. 16 ఓవర్లకు 125/7తో నిలిచిన సన్రైజర్స్ 150 అయినా దాటుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే కెప్టెన్ కమిన్స్ ఆఖరి ఓవర్లో చెలరేగి ఆడి జట్టుకు ఊహించిన దాని కంటే ఎక్కువ స్కోరే సాధించి పెట్టాడు. అతడి ధాటికి చివరి 4 ఓవర్లలో హైదరాబాద్ 48 పరుగులు సాధించింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ (బి) చావ్లా 48; అభిషేక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) కాంబోజ్ 5; నితీశ్ (సి) కాంబోజ్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; యాన్సెన్ (బి) హార్దిక్ 17; షాబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ ఎల్బీ (బి) చావ్లా 3; కమిన్స్ నాటౌట్ 35; సన్వీర్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-56, 2-68, 3-90, 4-92, 5-96, 6-120, 7-124, 8-136; బౌలింగ్: తుషార 4-0-42-0; అన్షుల్ కాంబోజ్ 4-0-42-1; బుమ్రా 4-0-23-1; హార్దిక్ 4-0-31-3; చావ్లా 4-0-33-3
ముంబయి ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) యాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ ధీర్ (సి) యాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ నాటౌట్ 102; తిలక్వర్మ 37 నాటౌట్; ఎక్స్ట్రాలు 22 మొత్తం: (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-26, 2-31, 3-31; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-22-1; యాన్సెన్ 3-0-45-1; కమిన్స్ 4-1-35-1; నటరాజన్ 3.2-0-31-0; నితీశ్కుమార్ 2-0-16-0; షాబాజ్ 1-0-11-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!