2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
చరిత్రలోనే తొలి ఐదు స్థానాల్లో ఒకటి
సూపర్ ఎల్నినోతో తీవ్ర ఉష్ణోగ్రతలు
ముందస్తు రుతుపవన జల్లుల జాడే లేదు
ఎన్నికలపై ఎండల ప్రభావం
క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో.. భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 11వ మాసం (ఏప్రిల్) అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని తెలిపింది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న ఓటింగ్, అభ్యర్థుల ప్రచారంపై వాతావరణ మార్పుల ప్రభావం ఉందని పేర్కొంది. ఈ మేరకు ‘‘దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?’’ అనే అంశం పేరిట నివేదిక విడుదల చేసింది.
ముఖ్యాంశాలివీ...
- ఈ ఏడాదిలో ప్రపంచంలోని 49% జనాభా 64 దేశాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.
- సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4-8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి అది 10-20 రోజులకు పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో పది మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటికే 20% ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్ ఎల్నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
- భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీపకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి సముద్రగాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్నిచోట్ల నమోదయ్యాయి. భారత తూర్పు తీరప్రాంతం అత్యంత ప్రభావమైంది.
- అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఏప్రిల్లో భారత్లోని 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మాజీ ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలు..
వేసవిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్, కమిషనర్లు నివేదికలో తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘ప్రస్తుత ఎన్నికలను 2023 డిసెంబరు 17 నుంచి 2024 జూన్ 16 వరకు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అయితే నవంబరు, డిసెంబరుల్లో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లోక్సభ ఎన్నికలు రెండు, మూడు నెలల జాప్యంతో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, రాష్ట్రాల ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం చేసి, పార్లమెంటు ఎన్నికలు ఆ 6 నెలల కాలంలో నిర్వహించాలి. 2029లోనూ సాధారణ ఎన్నికలకు జనవరి 1 నుంచి జూన్ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయం. లేదంటే రాష్ట్రాల ఎన్నికలు కొంత ముందు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్కు అధికారాలు కల్పిస్తూ చట్టసవరణ చేయాలి.’’ అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. ‘‘దేశంలో ఎన్నికలను 180 రోజుల్లోగా ఎప్పుడైనా నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. వేసవి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు చల్లటి ప్రదేశాలు, తాగునీటి వసతి కల్పించాలి. అయితే ప్రభుత్వ పదవీకాలాన్ని తగ్గించడానికి వీల్లేదు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అకడమిక్ క్యాలెండర్ తప్పకూడదు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, వేసవి విపత్తుల ప్రభావాన్ని తగ్గించాలి’’ అని విశ్రాంత ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం