logo

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కోడుమూరి తెదేపా అభ్యర్థి బి.దస్తగిరి పేర్కొన్నారు.

Published : 01 May 2024 20:12 IST

సీబెళగల్‌: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కోడుమూరి తెదేపా అభ్యర్థి బి.దస్తగిరి పేర్కొన్నారు. మండలంలోని గుండ్రెవుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారం చేస్తు తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. ఒక ఓటు నాకు రెండో ఓటు ఎంపీ అభ్యర్థి పి.నాగరాజుకు వేసి గెలిపించాలని కోరారు. తెదేపా అధికారంలోకి వస్తే గ్రామంలో 20 టీఎంసీల జలాశయం నిర్మిస్తామని తెలిపారు. దీంతో తాగునీరు సాగునీరు ఉమ్మడి జిల్లాతో పాటు కడప జిల్లాకు కూడా సాగునీరు అందిస్తామని చర్చించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల మాజీ కన్వీనర్‌ చిన్న తిమ్మప్ప, జడ్పీటీసీ గిరిజోల్‌, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీటీసీలు ఈరన్న, నూర్‌జాన్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్ బాబు, బి.శ్రీను, జనసేన నాయకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని