logo

తెదేపా అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే పింఛన్‌

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ. 4 వేల పింఛన్‌, వికలాంగులకు 6 వేల పింఛన్‌ అందిస్తామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు, మండల ఇన్‌ఛార్జ్‌ మల్లికార్జున గౌడ్ అన్నారు.

Updated : 04 May 2024 17:31 IST

చిప్పగిరి: తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ. 4 వేల పింఛన్‌, వికలాంగులకు 6 వేల పింఛన్‌ అందిస్తామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు, మండల ఇన్‌ఛార్జ్‌ మల్లికార్జున గౌడ్ అన్నారు. చిప్పగిరి మండలం కుందన్గుర్తి, బెల్డోన, సంగాల గ్రామంలో ఎన్నికల ప్రచారం శనివారం నిర్వహించారు. జడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు, మండల కన్వీనర్ షేక్షావలి, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.  మండలం ఇన్‌ఛార్జ్‌ బి. మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 50 యాదవ కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని