ఎన్నాళ్లకెన్నాళ్లకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలపై ఐదేళ్ల కిందట నిలిచిన కాంక్రీటు పనులు పునః ప్రారంభించారు. వేసవిలో చేపట్టాల్సిన ఈ పనులను కాలువలను తవ్విన గుత్తేదారు విస్మరించారు.
ఐదేళ్ల తర్వాత కాంక్రీట్ పనులు
కేఎల్ఐ డీ-8 కాలువపై నిర్మాణాలు
చాకల్పల్లి శివారులో కేఎల్ఐ డీ-8 కాలువపై నిర్మిస్తున్న డ్రాపు
వనపర్తి వ్యవసాయం, న్యూస్టుడే : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలపై ఐదేళ్ల కిందట నిలిచిన కాంక్రీటు పనులు పునః ప్రారంభించారు. వేసవిలో చేపట్టాల్సిన ఈ పనులను కాలువలను తవ్విన గుత్తేదారు విస్మరించారు. దీంతో కాలువలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కేఎల్ఐ పనులకు నాగర్కర్నూల్ కేంద్రంగా అధికారులు చేయించేవారు. మూడేళ్ల క్రితం ఏ జిల్లా పరిధిలోని పనులను ఆ జిల్లా నీటిపారుదల శాఖకు అప్పగించారు. వాటిని చేయాల్సిన గుత్తేదారు మాత్రం ఎవరి మాటలు వినకుండా వెళ్లిపోయారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నుంచి నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తి సమీపంలో డీ-8 కాలువ ప్రారంభమవుతుంది. రాంరెడ్డిపల్లి, లక్ష్మీదేవమ్మపల్లి, చాకల్పల్లి, ఏదుట్ల, రేమద్దుల గ్రామాల మీదుగా కోడేరు మండలం రాజాపూరు వరకు ఈ కాలువ 34 కి.మీ. దూరం నిర్మించారు. మొత్తం 28 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ కాలువపై 225 చోట్ల సిమెంటుతో డ్రాపులు, యూటీలు, వంతెనలు నిర్మించాల్సి ఉండగా కేవలం 35 చోట్ల మాత్రమే పనులు పూర్తి చేశారు. వీటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం వల్ల కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తూ కట్టలకు ప్రమాదకరంగా మారింది. పొలాల నుంచి వర్షం నీరు వెళ్లకుండా ఈ కాలువ కట్టలు అడ్డుగా మారాయి. నీరు వేగంగా వెళ్లేచోట డ్రాపులు నిర్మించి నీటివేగాన్ని నియంత్రించాల్సి ఉంది. కొన్నిచోట్ల కాలువలపై వంతెనలు నిర్మించాల్సి ఉండగా వాటిని కూడా నిర్మించకుండా వదిలేశారు.
3 డ్రాపులు.. 2 యూటీల పనులు పూర్తి : గుత్తేదారు చేపట్టాల్సిన కాంక్రీటు పనులను ప్రతి ఏడాది వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం యాసంగిలో కాలువలకు నీటిని నిలిపివేశారు. దీంతో ఆరు నెలల క్రితమే పనులు ప్రారంభమవుతాయని రైతులు భావించారు. నీటిపారుదల శాఖ అధికారులు గుత్తేదారు వెంటపడినా పెడచెవిన పెడుతూ వచ్చారు. చివరకు రెండు నెలల క్రితం గుత్తేదారు డీ-8 కాలువపై సిమెంటు పనులు చేయడానికి ముందుకు రావడంతో నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్రావు, డీఈ రమణాదేవి, ఏఈలు ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టాలో ఆయనకు సూచించారు. ఈనేపథ్యంలో చాకల్పల్లి, రాంరెడ్డిపల్లి, లక్ష్మీదేవమ్మపల్లి, ఏదుట్ల శివారుల్లో 9 చోట్ల డ్రాపులు, 4 చోట్ల యూటీల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 3 డ్రాపులు, 2 యూటీల పనులు పూర్తయ్యాయి. పాన్గల్ మండలంలోని రేమద్దుల శివారులో మరో 10 సిమెంటు పనులు చేపట్టారు. ఈఈ మధుసూదన్రావు, డీఈ వెంకటరమణాదేవి, ఏఈ వెంకటేశ్వర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు.
వేసవి వరకు పూర్తి చేస్తాం
కేఎల్ఐ కాలువలు వనపర్తి నీటిపారుదల శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుత్తేదారుతో పనులు చేయిస్తున్నాం. ప్రస్తుతం చేపట్టిన డ్రాపులు, యూటీలు, వంతెనల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. వేసవికాలం పూర్తయి కాలువలకు నీరు విడుదల చేసే వరకు ప్రారంభించిన 23 పనులను పూర్తి చేయిస్తాం.
మధుసూదన్రావు, ఈఈ, నీటిపారుదలశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!