మార్కండేయ ఎత్తిపోతల ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానుంది. బిజినేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేఎల్ఐ పథకం కింద కాలువలు తీసినప్పటికీ బిజినేపల్లి మండలంలో కొంత భాగానికి సాగునీరందడం లేదు.
న్యూస్టుడే, నాగర్కర్నూల్
జలాశయంగా మారనున్న మార్కండేయ చెరువు
జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానుంది. బిజినేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేఎల్ఐ పథకం కింద కాలువలు తీసినప్పటికీ బిజినేపల్లి మండలంలో కొంత భాగానికి సాగునీరందడం లేదు. ఎత్తైన ప్రదేశం కావడంతో సమస్యగా మారింది. చాలా రోజుల నుంచి ఈ ప్రాంత ప్రజలు సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకం కోసం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పలుమార్లు సాగునీరందించేందుకు మినీ ఎత్తిపోతల పథకం మంజూరుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 05.06.2021న ఈ పథకానికి రూ.76.95 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్కండేయ చెరువును జలాశయంగా మార్చి 0.97 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న కాలువ ద్వారా 40 మీటర్ల ఎత్తున జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. పథకం పూర్తయితే 7,310 ఎకరాలకు సాగునీరందనుంది. మామ్మయిపల్లి, పోలేపల్లి, శాయిన్పల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతో పాటు 17 తండాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగటంతో పాటు చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తాయి.
ఎదురుచూపులకు తెర..
ఇప్పటికే నిధులు మంజూరవడంతో ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బిజినేపల్లి మండలంలో చాలా గ్రామాలకు మేలు జరుగనుంది. ఈ పథకానికి 100 ఎకరాల నుంచి 120 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 60 ఎకరాల భూమి వరకు సర్వే పనులు పూర్తి చేశారు. పది రోజుల్లో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనుండటంతో నాగర్కర్నూల్ పట్టణంలో అభివృద్ధి పనులతో పాటు బిజినేపల్లిలో ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి రాక నేపథ్యంలో నాగర్కర్నూల్ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న ఫుట్పాత్ వ్యాపారులను కొద్ది రోజులపాటు తొలగించుకోవాలని సూచించారు. మార్కండేయ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్వే పనుల ప్రక్రియ కొనసాగుతోందని పనులు ప్రారంభిస్తే ఏడాది లోపు పూర్తి అవుతాయని నాగర్కర్నూల్ నీటిపారుదల శాఖ ఈఈ పార్థసారథి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి