ఈవీఎంల వయసు 35 ఏళ్లు
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం.
1989లో తొలిసారి వినియోగం
2018 నుంచి వీవీప్యాట్ అనుసంధానం
ఎన్నికల్లో పోలింగ్ కోసం ఉపయోగించే ఈవీఎం
న్యూస్టుడే, అచ్చంపేట: ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)ను తొలిసారి 1989లో వినియోగంలోకి తెచ్చారు. అయితే అప్పట్లో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వీటిని వినియోగించారు. ఆ తరువాత రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 25 నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంల వినియోగం ద్వారా పోలింగ్ నిర్వహించే విధానం సత్ఫలితాలను ఇవ్వడంతో 2001లో పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈవీఎంలను వినియోగించి ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత 2004లో దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను ఉపయోగించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో 2018 నుంచి ఓటర్లు ఎవరికి ఓటు వేశారో చూసుకునేందుకు వీవీప్యాట్ పరికరాన్ని ఈవీఎంకు అనుసంధానం చేశారు. బ్యాలెట్ యూనిట్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నన్ ఆఫ్ ది అబోవ్ (నోటా)ను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఓటర్లకు ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటాపై ఓటు వేసే విధానాన్ని 2013 నుంచి ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది.
జాతీయ పార్టీగా గుర్తింపు ఎలా?
న్యూస్టుడే, అచ్చంపేట: ఈవీఎంలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను వరుస క్రమంలో నమోదు చేస్తారు. ఎన్నికల నామపత్రాల సమయంలోనూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ పదాలను తరచుగా ఉపయోగిస్తున్నా చాలా మందికి జాతీయ, ప్రాంతీయ పార్టీలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. జాతీయ పార్టీలు రాజధాని కేంద్రంగా వ్యవహారాలను నడిపిస్తూ కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కృషి చేస్తుంటాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుతోపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తులను కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ.. ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లోని పోలైన మొత్తం ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం ఇస్తుంది. ఒకే రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఆరు శాతం సాధిస్తే ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల్లో చీలికలు ఏర్పడి విడిపోతాయి. సిద్ధాంతపరంగా లేదా వ్యక్తుల కారణంగా ఒక రాజకీయ పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం నెలకొన్నప్పుడు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.
ఓటరు చేతికి సమస్త సమాచారం
న్యూస్టుడే- కోస్గి న్యూటౌన్, రాజోలి: ఓటర్లకు పోలింగ్ చీటీలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. మార్గదర్శి(గైడ్), కరపత్రాలు, గోడపత్రిలకలు ముద్రించి ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
- సాధారణంగా చీటీలను ఎన్నికలకు వారం, పది రోజుల ముందుగా చేపట్టేవారు. సమయం సరిపోక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సారి 17 రోజుల ముందుగానే ప్రారంభించారు. చీటీలో ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, పోలింగ్ కేంద్రం పేరు, సంఖ్య, చిరునామా, ఓటరు జాబితాలోని సంఖ్య తదితర వివరాలతో పాటు సంబంధిత బీఎల్వో పేరు, సెల్ఫోన్ నంబరు, ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పోలింగ్ రోజున ఓటర్లు పాటించాల్సిన నిబంధనలు ఈ చీటీలో పొందుపరిచారు. ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి వెబ్సైట్, 1950 టోల్ఫ్రీ నంబర్ కూడా ముద్రించి ఉంది. మే 8 నాటికి చీటీల పంపిణీ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం గడువు విధించిందని కోస్గి తహసీల్దారు బక్క శ్రీనివాసులు ‘న్యూస్టుడే’తో అన్నారు.
ఓటరు గైడ్: ఈ సారి ఓటరు గైడ్ పుస్తకం ప్రతి ఇంటికీ చేరేలా ప్రణాళిక రూపొందించారు. 15 పేజీల పుస్తకంలో అనేక అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా కొత్త ఓటరుగా ఆన్లైన్, ఆఫ్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలి.? ఎప్పుడు చేసుకోవాలో వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు పరిశీలించుకోవడం ఎలాగో వివరించారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు ఏలాంటి గుర్తింపు కార్డులు తీసుకుపోవచ్చు. ఏవి తీసుకుపోకూడదో వివరించారు. పోలింగ్ బూత్లో ప్రక్రియ ఎలా సాగుతుంది. ఓటు వేసే విధానం గురించి క్షుణ్ణంగా తెలిపారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన వివిధ యాప్లు, కల్పిస్తున్న సౌకర్యాలు, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం, చివరగా తప్పకుండా ఓటు వేస్తానంటూ ఓటరు ప్రతిజ్ఞ అందులో పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి