logo

భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం

రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 07 May 2024 15:43 IST

రాజోలి: రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో రాజోలి, తూర్పు గార్లపాడు, పచ్చర్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు భాజపా మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రాజోలి, మాన్‌దొడ్డి, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని