logo

జిల్లా కేంద్రానికి పాఠ్య పుస్తకాల రాక

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి.

Updated : 08 May 2024 17:07 IST

రాజోలి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. ఒకటి నుంచి పదో తరగతికి సంబంధించి ఆంగ్ల, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఆయా సబ్జెక్టుల పుస్తకాలు వస్తున్నాయని జిల్లా విద్యాశాఖ పుస్తక విభాగం ఇన్‌ఛార్జి అమరిష్ తెలిపారు. వచ్చిన వాటిని జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నామన్నారు. ఇప్పటివరకు 40 శాతం మేర పుస్తకాలు వచ్చాయని పాఠశాలలు తెరిచే నాటికి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు