logo

భాజపాలో పలువురి చేరిక

రాజోలు మండలం చిన్నదానవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి భాజపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 08 May 2024 17:18 IST

రాజోలి: రాజోలు మండలం చిన్నదానవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి భాజపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ పదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మూడోసారి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు నారాయణతో పాటు మరో 25 మంది పార్టీలో చేరగా వారికి కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు శివారెడ్డి, అక్కల రమాదేవి, స్వప్న, మండలం కార్యవర్గ సభ్యులు, బూతు స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు