logo

భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యం

భాజపా  పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, మూడోసారి అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు.

Published : 09 May 2024 14:49 IST

రాజోలి : భాజపా  పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, మూడోసారి అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు. గురువారం ఆయన  రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు కోట్ల వీరేశ్ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగర్ కర్నూల్  భాజపా ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. భాజపా ప్రభుత్వ పాలనలో దేశ భద్రతతో పాటు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విషయంలో  ముందుకు దూసుకెళ్తుందన్నారు.  ఉపాధి కల్పనలో భాగంగా 25 కోట్ల మందికి నూతనంగా  ప్రభుత్వ,  ప్రైవేటు సెక్టార్లలో  ఉద్యోగాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల భాజపా అధ్యక్షుడు సంజీవరెడ్డి, గ్రామ బూత్ అధ్యక్షులు, రామాంజనేయులు, దస్తగిరి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని