logo

భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: సురేఖ

కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు.

Published : 10 May 2024 04:13 IST

ఎల్కూరులో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఏఐసీసీ సమన్వయకర్త

మల్దకల్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఎల్కూరు, అమరవాయి, కుర్తిరావులచెర్వు, నీలిపల్లె, చర్లగార్లపాడు గ్రామాల్లో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేసి అత్యధిక మెజార్టీతో మల్లు రవిని గెలిపించాలన్నారు. అమరవాయి కృష్ణారెడ్డి, ఎల్కూరు ద్యావర్ల తిమ్మప్ప, తెల్గునర్సింహులు, రాజశేఖరరెడ్డి, మద్దిలేటి, గోపాల్‌, శేఖరయ్య, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని