logo

కాంగ్రెస్ జన జాతర ర్యాలీని జయప్రదం చేయండి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం ఏఐసీసీ కార్యదర్శి ర్యాలీని చేపట్టనున్నారు.

Published : 10 May 2024 16:29 IST

రాజోలి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం ఏఐసీసీ కార్యదర్శి ర్యాలీని చేపట్టనున్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టనున్న జన జాతర ర్యాలీని జయప్రదం చేయాలని ఐజ పట్టణ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. వారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఓల్డ్ బస్టాండు,  పోలీస్ స్టేషన్, సంత బజార్, ఎస్సీ కాలనీ మీదుగా  కొత్త బస్టాండ్ వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు