ఆడపిల్లలకు మేనమామలా కేసీఆర్
కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్, దిల్లీలో కూర్చొని మాట్లాడితే ఫలితం ఉండదని, లబ్ధిదారులతో మాట్లాడాలని మంత్రి హరీశ్రావు అన్నారు.
సంక్షేమ సంబురాల్లో మంత్రి హరీశ్రావు
ప్రమాద బీమా చెక్కును లబ్ధిదారుకు ఇస్తున్న మంత్రి హరీశ్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు
సిద్దిపేట, న్యూస్టుడే: కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్, దిల్లీలో కూర్చొని మాట్లాడితే ఫలితం ఉండదని, లబ్ధిదారులతో మాట్లాడాలని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేటలో సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నుంచి నలుగురికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 44 లక్షలకు చేరిందని వివరించారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కొక్కరికి రూ.700 దాటడం లేదన్నారు. ఆడపిల్లల మేనమామలా మారిన సీఎం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ ద్వారా 12.71 లక్షల మంది వివాహాలకు కులం, మతం, పార్టీ, లంచాలకు తావులేకుండా రూ.11,130 కోట్లు ఇచ్చారన్నారు. నాడు చంద్రబాబు, రోశయ్య, కిరణ్కుమారెడ్డి సహా ఏ ప్రభుత్వాలూ ఆ దిశగా ఆలోచన చేయలేదన్నారు. ఈ నెల 14 నుంచి రాష్ట్రంలోని 6.80 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ మొదలెడతామన్నారు. సిద్దిపేట అభివృద్ధిపై ప్రస్తావించే సమయంలో.. దేశంలో కుక్కలు మనుషులను చంపవచ్చు కాని అదే మనుషులు కుక్కలను చంపితే తప్పుగా మారిందని, దీంతో వాటికి కు.ని. శస్త్ర చికిత్సలు చేయించాల్సిన పరిస్థితికి చేరామని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, బల్దియా అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షుడు కనకరాజు, రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాలసాయిరాం, కొండం సంపత్రెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన