సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం.
నీలం మధు
న్యూస్టుడే, మెదక్: సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. ఇతర లోక్సభ నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల వారికి అవకాశం ఇచ్చిన హస్తం పార్టీ, మెదక్ లోక్సభ నియోజకవర్గానికి వచ్చే సరికి బీసీకి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి నుంచి రేసులో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్కు చెందిన నీలం మధు అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది. భారాసతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్, భాజపాలో చేరుతారని ప్రచారం జరిగినా, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరి పటాన్చెరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం లోక్సభ ఎన్నికలు రావడంతో ఎంపీగా పోటీచేసి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
యోధులను కాదని...: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో పలువురు కాంగ్రెస్ నేతలు పదవులను ఆశిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు రావడంతో ఎంపీగా పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూశారు. బరిలో నిలవాలని భావిస్తున్న వారు అర్జీ చేసుకోవాలని టీపీసీసీ సూచించడంతో మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించగా, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి పేర్లు సైతం వినిపించాయి. పోటీ చేసేందుకు మైనంపల్లి విముఖత వ్యక్తం చేయడం, ఇటీవల నిర్మలారెడ్డికి కార్పొరేషన్ పదవి అప్పగించడంతో వారిద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు పటాన్చెరుకు చెందిన నీలం మధుతో పాటు 2009 కాంగ్రెస్, 2014లో భాజపా తరఫున ఎంపీగా పోటీచేసిన నరేంద్రనాథ్ పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఆశావహుల బలాబలాలపై రాష్ట్ర పార్టీ సర్వే చేయించింది. ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించిన అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలు మధు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో అతని పేరును కాంగ్రెస్ ఎన్నికల కమిటీ(సీఈసీ)కి సిఫార్సు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి దిల్లీలో జరిగిన సమావేశంలో మెదక్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఉద్యమంలో పాల్గొని
పటాన్చెరు మండలం చిట్కుల్కు చెందిన నీలం మధు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. భారాసలో కొనసాగిన ఆయన 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత 2014లో ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 2014 ప్రాదేశిక ఎన్నికల్లో భారాస(నాటి తెరాస) తరఫున జడ్పీటీసీగా పోటీ చేశారు. అనంతరం 2019లో సర్పంచి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్ఎంఆర్ యువసేన స్థాపించి గత కొన్నేళ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వ్యక్తిగత వివరాలు
పేరు: నీలం మధు
వయసు: 41
స్వస్థలం: చిట్కుల్, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లా.
తల్లిదండ్రులు: నీలం నిర్మల్, రాధ.
విద్యార్హత: పదో తరగతి
కుటుంబం : భార్య కవిత, ఇద్దరు సంతానం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో