‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
రోజూ 40 వేల మందికి పైగా కూలీల హాజరు
హుస్నాబాద్ మండలం మడదలో కూలీలు
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం, గజ్వేల్ గ్రామీణం: వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా కూలీల సంఖ్య గత ఏడాదితో పోల్చితే గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం యాసంగి సీజన్లో మొక్కజొన్న పంట కోత దశలో ఉండగా వరి గొలుసు వేసే దశలో ఉంది. కూలీలంతా ఉపాధి హామీ పనులపై దృష్టి సారించారు. కూలీలకు డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. గత మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఎండ తీవ్రతతో కూలీలు ముందుకు రాకపోవడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
గ్రామానికో అధికారి కేటాయింపు
అధికారులు తక్కువ హాజరు ఉన్న మండలాలపై దృష్టి సారించారు. ప్రతి గ్రామంలో కనీసం 75 నుంచి 100 మందిని పనికి రప్పించాలని నిర్ణయించారు. ఆయన స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఆరా తీశారు. ఏపీడీలు, ఇతర అధికారులను గ్రామానికి ఒకరి చొప్పున కేటాయించారు. డబ్బులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
వంద రోజులు పూర్తి
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 40 వేలకు పైగా కూలీలు హాజరవుతున్నారు. ఈ నెల 22న 40,586 మంది కూలీలు హాజరయ్యారు. మార్చి నెలలో గతంలో ఎప్పుడూ ఇంత పెద్దసంఖ్యలో రాలేదు. సాధారణంగా మే నెలలో సంఖ్య 40 వేలు దాటుతుంది. చాలా మంది కూలీల జాబ్కార్డులు వంద రోజులు పూర్తి కావడంతో పనికి రావడం లేదు. బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి అనేకచోట్ల పంట పొలాలు ఎండిపోయాయి. వ్యవసాయ పనులు లేక రైతులు ఉపాధి పనులకు వస్తున్నారు.
చేపడుతున్న పనులు
- భూముల అభివృద్ధి
- చెట్లు తొలగించి చదును
- పొలాలకు వెళ్లేందుకు మట్టి దారుల నిర్మాణం
- చేపల చెరువుల తవ్వకం
- ఫీడర్ ఛానల్ కాలువ
- నీటివనరుల్లో పూడిక తీయడం
- మట్టితో చెరువు, కుంట కట్టల బలోపేతం
2,000 మందికి పైగా కూలీలు హాజరవుతున్న మండలాలు: అక్కన్నపేట, కొండపాక, దుబ్బాక, జగదేవపూర్, గజ్వేల్, కోహెడ, నంగునూరు, చిన్నకోడూరు
1,000 మందికి పైగా హాజరు: మద్దూరు, వర్గల్, దౌల్తాబాద్, మిరుదొడ్డి, బెజ్జంకి, చేర్యాల, ములుగు, సిద్దిపేట గ్రామీణ, రాయపోల్, మర్కూక్, తొగుట, హుస్నాబాద్
1,000 మంది కంటే తక్కువ హాజరు: సిద్దిపేట అర్బన్, కొమురవెల్లి, నారాయణరావుపేట
అక్కన్నపేట మండలంలో అత్యధికంగా 2,637 మంది కూలీలతో మొదటి స్థానం... 804 మందితో నారాయణరావుపేట చివరి స్థానంలో ఉన్నాయి.
జాబ్ కార్డులు: 2,01,567
క్రియాశీలం: 1,35,564
ఏప్రిల్లో పెరిగిన వేతనం అమలు
ఉపాధి కూలీలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినపుడు కూలీ రూ.87.50గా ఉండేది. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తారు. ఉపాధి కూలీలకు గతంలో వేసవి భత్యం ఇచ్చేవారు. మార్చి నుంచి జూన్ వరకు 15 నుంచి 30 శాతం అందించేవారు. రెండేళ్ల నుంచి భత్యం అందడం లేదు. దాని స్థానంలో ఏటా ఏప్రిల్లో కొంత మొత్తం కూలీని పెంచుతున్నారు. 2022లో రూ.12, 2023లో రూ.15 పెంచారు. ఈ ఏడాది రూ.28 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పనుల ప్రదేశంలో గుడారం, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో