ప్రచారం.. ఇక ముమ్మరం
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలోకి పార్టీల అభ్యర్థులు, అధినేతలు
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ నేతల ప్రచారంతో నియోజకవర్గంలో పాగా వేయాలని భాజపా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. మరోవైపు భారాస అధినేత కేసీఆర్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్.
కేసీఆర్ బస్సు యాత్రకు సన్నాహాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేసే ఉద్దేశంతో భారాస ఇప్పటికే నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భవన్లో గురువారం భారాస అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించినట్లు సమాచారం. బస్సుయాత్ర మెదక్ నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా వెళ్లేలా ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం.
జాతీయ నాయకులతో ప్రచారం చేయనున్న భాజపా
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న భాజపా జహీరాబాద్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ జాతీయ నేతలను ప్రచారానికి ఆహ్వానించి సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను నామినేషన్ కార్యక్రమానికి రప్పిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.
సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, అందోలు, నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి, బాన్సువాడ, జహీరాబాద్లో పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 24న జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ లేదా రోడ్షో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పీసీసీ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రచారం ముగిసేలోపు ఎల్లారెడ్డి, బాన్సువాడ, అందోలు, కామారెడ్డిలలో సీఎం సభలు నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శల జోరు.. కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. -
కార్మికుల రాత మార్చే నేత కావాలి
[ 01-05-2024]
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. -
‘శత’శాతం ప్రగతి..!
[ 01-05-2024]
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
శాతం పెరిగె.. స్థానం దిగజారె!
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. -
‘పది’లో ద్వితీయస్థానం అభినందనీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
పెళ్లింట విషాదం..
[ 01-05-2024]
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. -
ఓటు పాఠం.. అవగాహన కీలకం
[ 01-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. -
సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు
[ 01-05-2024]
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ 27న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్ వెంకన్న మంగళవారం తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 01-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. -
ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. -
డీఈఓకు సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM