logo

డీఈఓకు సన్మానం

పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Published : 01 May 2024 01:46 IST

జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డికి మిఠాయి తినిపిస్తున్న పీఆర్‌టీయూ ప్రతినిధులు
సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలకు కృషి చేసిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డిని పీఆర్‌టీయూ జిల్లా శాఖ కార్యాలయంలో సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. పీఆర్‌టీయూ ప్రతినిధులు శశిధర్‌శర్మ, ఇంద్రసేనారెడ్డి, వెంకటరాజం, సురేందర్‌రెడ్డి, రాజశేఖర్‌, పార్థసారథి, వెంకటేశ్‌, రాజేందర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనతరం యూటీఎఫ్‌ ప్రతినిధులు తప్పెట్ల యాదగిరి, సెక్టోరియల్‌ అధికారి రామస్వామి, కొండపాక మండల ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఏసీఈజీ లక్ష్మయ్య, ఉపాధ్యాయులు డీఈఓను సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని