కార్మికుల రాత మార్చే నేత కావాలి
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
నేడు మేడే
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారంతా దూరం ప్రాంతం నుంచి వచ్చినవారే.
హత్నూర మండలం గుండ్లమాచునూర్ శివారులోని ఓ పరిశ్రమలో ఇటీవల రియాక్టర్ పేలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదం మరువకముందే చందాపూర్లోని మరో పరిశ్రమలో గత నెలలో రియాక్టర్లు పేలి ఆరు మంది మృతి చెందారు. నెల రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడంతో కార్మికుల్లో ప్రాణ భయం నెలకొంది.
న్యూస్టుడే, జిన్నారం, సిద్దిపేట, చేగుంట, తాండూరు, హత్నూర, మనోహరాబాద్: పరిశ్రమలు.. అభివృద్ధికి సూచికలు. వాటిల్లో పని చేసే శ్రామికులు మాత్రం అష్టకష్టాలు పడుతుంటారు. భవన నిర్మాణాలు, బీడీ, ఇతర రంగాల్లోనూ కార్మికులు వేలాది మంది పని చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఎంతోమంది పరిశ్రమల్లో అవస్థల మధ్య పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ సారైనా ఎంపీగా ఎన్నికయ్యే నేతలు తమ సమస్యలు పరిష్కరించి మా జీవితాలను చక్కదిద్దుతారని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా వారి వెతల తీరుపై ‘న్యూస్టుడే’ కథనం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 30 వరకు పారిశ్రామిక వాడలున్నాయి. వాటిల్లో లక్షలాది మంది పని చేస్తున్నారు. వీరిలో 3.75 లక్షల మంది ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. మిగతావారంతా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో లక్ష మంది వరకు స్వగ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీళ్లూ హక్కు వినియోగానికి వెళ్లేందుకు ప్రయాణానికి బుకింగ్ చేసుకొని సిద్ధమయ్యారు.
రక్షణ చర్యలు కరవు..
పరిశ్రమల్లో రక్షణ చర్యలు కరవయ్యాయి. ప్రధానంగా రసాయన పరిశ్రమల్లో భద్రత చర్యలు శూన్యం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల హత్నూర, జిన్నారంలో జరిగిన ఘటనలే నిదర్శనం. ఇక పరిహారం విషయంలో స్పష్టత లేదు. భారీ పరిశ్రమలకు చెందిన వారికే బీమా సదుపాయం ఉంది. అసంఘటిత కార్మికులకు దాని గురించే తెలియదు. భవనాల నిర్మాణాల సమయంలో మేస్త్రీలు, కార్మికులు పడిపోయి చనిపోతున్నారు. కార్మికుల పరిహారంపై చట్టం తీసుకొచ్చేలా శ్రమిస్తామని హామీ ఇవ్వాలని కార్మికులు విన్నవిస్తున్నారు.
నెరవేరని హామీలు..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, కనీస వేతన చట్టం అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం, మౌలిక వసతులు, మహిళలకు రక్షణ వంటి ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామన్న హామీ అలాగే ఉండిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా గెలిచే నేత ఆయా సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
వైద్య సేవలు అందక..
ఏదైనా పరిశ్రమ, సంస్థలో 20 మందికి మించి పని చేస్తే ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారానికి చెందిన డిస్పెన్సరీ మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో కొనసాగుతోంది. గడ్డపోతారం, ఖాజీపల్లిలో ఉండే కార్మికులకు మేడ్చల్ జిల్లా షాపూర్నగర్కు వెళ్తున్నారు. సిద్దిపేటకు 2015లో డిస్పెన్సరీ మంజూరైనా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఔషధాలు, శస్త్రచికిత్సలకు హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారు. కాళ్లకల్, హత్నూరలోనూ వైద్య సేవలు అందడం లేదు. నాపరాళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తాండూరులోనే 20 వేల మందికిపైగా పని చేస్తున్నారు. ఇక్కడా ఈఎస్ఐ ఆసుపత్రి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు