పెళ్లింట విషాదం..
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో నవవరుడి దుర్మరణం
వెంకటేశం
చేగుంట: వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. పెళ్లి సంబరంలో మునిగిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. చేగుంట ఎస్ఐ బాల్రాజు తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేశ్ (23)కు మాసాయిపేట మండలం పోతాన్పల్లికి చెందిన యువతితో ఈనెల 26న వివాహం జరిగింది. పెళ్లి, విందు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం రాత్రి నిద్ర చేసేందుకు దంపతులిద్దరూ కొత్త ద్విచక్రవాహనంపై జంగరాయి నుంచి నూతన వధువు స్వగ్రామం పోతాన్పల్లికి బయల్దేరారు. రామంతాపూర్ వద్ద వీరు వెళ్తున్న బైక్ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారిద్దరు కింద పడిపోయారు. వెంకటేశ్ తలపై నుంచి అదే లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను తూప్రాన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గ్రామంలో తన సోదరుడు మహిపాల్తో కలిసి వ్యవసాయం చేస్తూ ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో, కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంట్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు కలిచివేశాయి. మిత్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుడి తల్లి సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ సర్వే..అన్నింటికీ ఆధారం
[ 22-05-2024]
కేంద్రానికి రాకుండానే భోజనం చేసినట్టు రికార్డులో నమోదు చేయడం, గుడ్లు, పాలు, బాలామృతం వంటివి పంపిణీ చేశామని రికార్డుల్లో చేర్చడం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కుటుంబ సర్వే’కు శ్రీకారం చుట్టింది. -
సదరం శిబిరం.. ఇక నిరంతరం
[ 22-05-2024]
సదరం శిబిరాల కోసం అర్హులైన దివ్యాంగులు ఇక నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. -
హరీశ్రావుతో కౌన్సిలర్ల భేటీ
[ 22-05-2024]
భారాస ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్రావును మంగళవారం ఐడీఏ బొల్లారం పురపాలిక కౌన్సిలర్లు కలిశారు. -
నట్టేట ముంచుతున్న నకిలీలు!
[ 22-05-2024]
ఏటా వానాకాలం వస్తే చాలు నకిలీ విత్తనాల బెడద ఉంటోంది. అన్నదాతల్ని నట్టెట ముంచుతోంది. రూ.లక్షల పెట్టుబడి నష్టపోవాల్సి వస్తోంది. -
కనులవిందు.. మామిడి పసందు
[ 22-05-2024]
‘గున్న మామిడి కొమ్మ మీద..’, ‘మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే..’, ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..’ ఇవన్నీ ఫలాల రాజు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే, సీజనల్గా ఆరోగ్యదాయిని అయిన మామిడి కాయ, పండు, వృక్షంపై సినీరచయితల కలంలో జాలువారిన గేయాలు. మామిడి కాయ, పండు. -
భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త
[ 22-05-2024]
కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. -
ఆటలో అప్రమత్తం.. క్రమశిక్షణతో సాద్యం
[ 22-05-2024]
బాలలకు, యువతకు చదువొక్కటే సరిపోదు.. క్రీడల్లో ప్రావీణ్యమూ ముఖ్యమే. అందుకే ప్రభుత్వం పాఠశాల, కళాశాలల స్థాయిలో వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. -
రారండి.. ఇంటర్లో చేరండి
[ 22-05-2024]
పదో తరగతి అనంతరం ఇంటర్ కోర్సులు కీలకం. వీటిల్లో చేరేందుకు అధిక శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు.