ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు.
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంతోషం వ్యక్తం చేస్తున్న పదో తరగతి విద్యార్థులు
న్యూస్టుడే, సిద్దిపేట: పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. మెరుగైన స్థానం సాధించడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 0.4 శాతం వ్యత్యాసంతో ప్రథమ స్థానాన్ని అందుకోలేకపోయినా.. తెలంగాణలో టాప్-2గా జిల్లా జయకేతనం ఎగురవేసింది. మరోవైపు మెరుగైన ఫలితాల జాబితాలో జడ్పీ పాఠశాలలు ముందంజలో నిలిచాయి.
బాలికలదే పైచేయి.. : జడ్పీ, ఉన్నత పాఠశాలలు - 222, ఆశ్రమ, వివిధ రకాల గురుకులాలు - 35, కేజీబీవీలు - 22, ఆదర్శ - 14, ఎయిడెడ్ - 1, ప్రైవేటు - 77 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 6,946 మంది బాలికలు పరీక్ష రాయగా 6,868 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ లెక్కన 98.88 శాతం పాసయ్యారు. బాలురు.. 7030 మంది పరీక్ష రాయగా 6920 మంది ముందడుగు వేశారు. ఉత్తీర్ణత శాతం - 98.44గా నమోదైంది
153 మందికి పదికి ‘పది’ జీపీఏ: ప్రైవేటు పాఠశాలలు మినహాయిస్తే.. మొత్తం 153 మందికి పదికి పది గ్రేడ్ వచ్చింది. అత్యధికంగా నంగునూరు మండలం నుంచి 23 మంది ఉన్నారు. జడ్పీ పాఠశాలల్లో పదికి పది జీపీఏ వచ్చినవారు 65 మంది, గురుకులాలు - 53, కేజీబీవీ - 10, ఆదర్శ - 25 మంది సాధించారు. గత ఏడాది 126 మంది సాధించారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 216 మంది 10/10 పొందారు. 2021-22లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
డిజిటల్ కంటెంట్తో ప్రోత్సాహం: పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్రావు డిజిటల్ కంటెంట్ను అందించి ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు పలుసార్లు నిర్వహించారు. ఉత్తరాల ద్వారా చైతన్య పరిచారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 40 రోజుల పాటు ప్రత్యేకంగా అల్పాహారం అందించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. పర్యవేక్షించిన కలెక్టర్, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి సిద్దిపేట గౌరవాన్ని చాటారంటూ అభినందించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆత్మీయంగా మాట్లాడారు. పిల్లలను వైద్యున్ని చేస్తారా.. ఇంజినీరును చేస్తారా అని ఆరా తీశారు.
ముందు నుంచి ప్రణాళికతో..: శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాధికారి
సిద్దిపేట ప్రతిష్ఠను నిలబెడుతూ.. గత స్థానాన్ని పదిలపర్చుకున్నాం. ప్రణాళికను అమలు చేశాం. ప్రత్యేక తరగతులు చక్కటి ఫలితాల సాధనకు దోహదం చేశాయి. పునశ్చరణ తరగతుల ద్వారా మరింతగా మెరుగుపర్చాం. జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు లక్ష్మయ్య, అధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!