గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
హరీశ్రావు, వినోద్కుమార్లను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు
బెజ్జంకి, న్యూస్టుడే: అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సాయంత్రం బెజ్జంకిలో కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రోడ్షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్కుమార్ విజన్ ఉన్న నాయకుడని, గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసి స్మార్ట్సిటీ తేవడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కేంద్రంతో కోట్లాడి పలు రైలు మార్గాలతో పాటు జాతీయ రహదారులను సాధించారని తెలిపారు. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలన ఆగమైందని, ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు. ఐదేళ్ల కాలంలో భాజపా ఎంపీ బండి సంజయ్ చేసిందేమి లేదని ఆరోపించారు. గుగ్గిళ్ల, పోతారం శివారులలో నిర్మిస్తున్న ఇథనాల్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే వరకు ప్రజలకు అండగా ఉద్యమిస్తామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్నానని, హక్కుల కోసం న్యాయవాద వృత్తిని వదిలి ప్రజా సేవకు పాటుపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బాలకిషన్, ఎంపీపీ నిర్మల, మండల అద్యక్షుడు మహిపాల్రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
హరీశ్రావు, వినోద్కుమార్లను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు, ప్రచార సభకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శల జోరు.. కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. -
కార్మికుల రాత మార్చే నేత కావాలి
[ 01-05-2024]
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. -
‘శత’శాతం ప్రగతి..!
[ 01-05-2024]
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
శాతం పెరిగె.. స్థానం దిగజారె!
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. -
‘పది’లో ద్వితీయస్థానం అభినందనీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
పెళ్లింట విషాదం..
[ 01-05-2024]
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. -
ఓటు పాఠం.. అవగాహన కీలకం
[ 01-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. -
సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు
[ 01-05-2024]
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ 27న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్ వెంకన్న మంగళవారం తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 01-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. -
ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. -
డీఈఓకు సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?