జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు.
నామపత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్, చిత్రంలో మంత్రి దామోదర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తదితరులు
సంగారెడ్డి టౌన్, న్యూస్టుడే: జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్.. మాజీ మంత్రి హరీశ్రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి దేవ శిఖమని, రాష్ట్ర సామాన్య ప్రజల పార్టీ అభ్యర్థి మున్వర్ హుసేన్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్, స్వతంత్ర అభ్యర్థులు అశోక్, జైపాల్ నాయక్, రమేశ్, యాకుబ్ షరీఫ్, మాణయ్య నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణికి సమర్పించారు.
మెదక్ పార్లమెంట్ స్థానానికి..
మెదక్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు దాఖలు చేశారు. నర్సాపూర్, పటాన్చెరు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మహిపాల్రెడ్డి, మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భట్టి జగపతితో కలిసి ఒక సెట్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మరో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకురాలు సుహాసినిరెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు రమేశ్, ప్రదీప్కుమార్, ఆంజనేయులు, నరహరి, భానుచందర్, యుగతులసీ పార్టీ అభ్యర్థి అనిల్ మొదటి సెట్ నామినేషన్ వేయగా, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థి ఎల్లయ్య, స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మినారాయణ, నవీన్ మరో సెట్ నామపత్రాలు సమర్పించారు.
జహీరాబాద్: సంగారెడ్డిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి జహీరాబాద్ నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పార్టీ నియోజకవర్గ ఛీఫ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు.
నేడు తుది గడువు
నామపత్రాల దాఖలుకు గురువారం తుది గడువు. ఇప్పటి వరకు మెదక్ పార్లమెంట్ స్థానానికి 33 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థి రఘునందన్రావు, భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేశారు. వీరితో పాటు ఆయా పార్టీల తరఫున పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను ఈనెల 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM