సంప్రదాయానికి సరి కొత్త హంగులు
వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు తీపి గుర్తుగా పదిలపర్చుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని కొందరు మహిళలు అందిపుచ్చుకుని ఆర్థికంగా బాటలు వేసుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా అభిరుచులు మారడం సహజం
ఉపాధి పొందుతున్న మహిళా డిజైనర్లు
నల్గొండ జిల్లాపరిషత్, న్యూస్టుడే
సారె ఆలంకరించిన బుట్టలు
వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు తీపి గుర్తుగా పదిలపర్చుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని కొందరు మహిళలు అందిపుచ్చుకుని ఆర్థికంగా బాటలు వేసుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా అభిరుచులు మారడం సహజం. వివాహ మహోత్సవంలో పూర్వ కాలం నుంచి పెళ్లి కుండలు, గరిక ముంత, సాన, కాడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా అందంగా అలంకరించిన బºనం, పెళ్లి కుండలు కనువిందు చేస్తున్నాయి. పెయింటింగ్ చేసిన కుండలకు ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. నల్గొండకు చెందిన డిజైనర్లు నోముల రుక్మిణీ, చైతన్యపురికాలనీకి చెందిన రమ్య, పాతబస్తీకి చెందిన కొయగూర ఆండాళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రజలు ఇష్టపడేలా చేతితో చేసిన డిజైన్ వర్క్, మురిపించే ఎంబ్రాయిడరీలతో కొత్త నమూనాలను ఆవిష్కరిస్తున్నారు.
ఆకట్టుకునేలా అలంకరణ
పెళ్లి వేడుకలో వాడే వస్తువులను అద్దాలు, ముత్యాలు, చెమ్కీలతో అలంకరిస్తున్నారు. వధువు, వరుడు ఒకరి కాలివేలు మరొకరు తొక్కేందుకు ఉపయోగించే సానరాయిని సైతం ఎంబ్రాయిడరీతో అలంకరిస్తున్నారు. పెళ్లికూతురు, కుమారుడి చేతిలో ఉండే గరికే ముంత, అవురేని కుండలను సైతం రంగురంగుల చెమ్కీలు, ముత్యాలతో డిజైన్ చేస్తున్నారు. తెరపత్రాలు, కొబ్బరి బోండం, సారే బుట్టలు, పెళ్లికూతురును మోసుకొళ్లే బుట్టను ఆకర్షణీయంగా అలంకరించడంతో వీటిపై మక్కువ పెరిగింది. జరీ, చిప్స్తో అలంకరించి ఎంబ్రాయిడరీ వర్క్తో తీర్చిదిద్దిన కుండలకు మంచి గిరాకీ ఏర్పడింది. మంగళ స్నానాల అలంకరణ, చలువ పందిళ్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణను బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకుంటున్నారు. వీటిని ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు.
ప్రజల అభిరుచికి తగినట్లు..
- నోముల రుక్మిణీ, నల్గొండ
వివాహ మహోత్సవంలో ఉపయోగించే కుండలు, ఇతర వస్తువులకు అలంకరణ పని 15 ఏళ్లుగా చేస్తున్నాం. ప్రజల అభిరుచికి తగ్గటు కొత్తగా రంగులతోపాటు మిర్రర్ వర్కు, కుందన్ జరీ ఉపయోగించి సరికొత్త హంగులతో అవురేని కుండలు, బోనం కుండల అలంకరణ చేస్తూ కుటుంబ ఆర్థిక పరిపుష్టికి బాటలు వేసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు