ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది.
మిర్యాలగూడలో పోల్ చిట్టీల పంపిణీని పరిశీలిస్తున్న తహసీల్దారు హరిబాబు
మిర్యాలగూడ పట్టణం, కనగల్, మునగాల, న్యూస్టుడే: ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. మే 13న ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోల్ చిట్టీల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఓటరు జాబితాలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికి బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ పోల్ చిట్టీలు పంపిణీ చేస్తున్నారు. ఏ రోజు ఎన్ని పోల్ చిట్టీలు పంపిణీ చేశారనేది సాయంత్రం ఉన్నతాధికారులకు నివేదిక సైతం పంపిస్తున్నారు.
అసలెందుకంటే..
ఎన్నికల సమయంలో ఓటరు పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు.. ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం పేరు తదితర వివరాలను పోలింగ్ అధికారులతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లు సైతం మార్క్ చేసుకుంటారు. వారి పేర్లను ఓటరు జాబితాలో వెతకడంతో సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓటరుతో పాటు పోలింగ్ కేంద్రం వివరాలతో పోల్ చిట్టీలు ముద్రించి ముందుగానే ఓటర్లకు పంపిణీ చేస్తారు. దీన్ని తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు అందులోని వివరాలతో పోలింగ్ అధికారులు, పార్టీల ఏజెంట్లు సులభంగా ఓటరు జాబితాలో మార్క్ చేసుకుంటారు.
పోల్ చిట్టీలో ముద్రించే వివరాలు..
పోల్ చిట్టీలో శాసనసభ నియోజకవర్గం, సంఖ్య, ఓటరు పేరు, లింగము, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, తండ్రి పేరు, పోలింగ్ లొకేషన్, పోలింగ్ కేంద్రం సంఖ్య, పోలింగ్ కేంద్రం భవనం వివరాలు, ఎన్నికల సంఘం వెబ్సైట్, కాల్ సెంటర్ నంబర్ తదితర వివరాలు ముద్రిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!
[ 08-05-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. -
ప్రైవేటు పనులకు.. ప్రభుత్వ పరికరాలు
[ 08-05-2024]
జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. -
ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. -
పార్టీలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది
[ 08-05-2024]
గడిచిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు. -
గెలిస్తే ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు
[ 08-05-2024]
‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను. -
ఓటుకు సెలవివ్వొద్దు..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. -
విదేశాల్లో ఓటుహక్కు ఇలా..
[ 08-05-2024]
ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. -
26 రోజుల పోరాటం.. 22 రోజులకు ఫలితం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది. -
చివరి భూములకూ సాగు నీరందిస్తాం: జానారెడ్డి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో, కార్నర్ సమావేశం నిర్వహించారు. -
సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!
[ 08-05-2024]
కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. -
శోభాయమానం.. నవ నృసింహుల సాలహారం
[ 08-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు. -
అక్రమ రవాణాకు చెక్
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. -
ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం
[ 08-05-2024]
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. -
వర్షాలకు రూ.80 లక్షల నష్టం: ఎస్ఈ
[ 08-05-2024]
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్ఈ పాల్రాజు తెలిపారు. -
నిత్య కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ఆరాధన
[ 08-05-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. -
వారి భవిత రాసేది.. యువతే..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
వేసవి శిబిరం.. క్రీడలకు ఊతం
[ 08-05-2024]
వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.