అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ.
ఉగాది మహానంది పురస్కారం అందుకుంటున్న ఆదె సత్యనారాయణ (పాత చిత్రం)
గుర్రంపోడు, న్యూస్టుడే: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్కు చెందిన ఈయన హాలియా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో విద్యారంగంలో చేస్తున్న కృషికి ఈ నెల 14న శ్రీవిరాట్ విశ్వవిజ్ఞానాధ్యాత్మిక, ధార్మిక కళాపరిషత్తు, తెలుగు వెలుగు సాహితీ వేదికలు ఉగాది మహానంది పురస్కారం అందించి గౌరవించాయి. నిపుణ మ్యాగజైన్లో పోటీపరీక్షలకు ఉపయోగపడే అనేక వ్యాసాలు ఆదె రాశారు. ఇప్పటికీ వెనుకబడిన తరగతుల సామాజిక సంక్షేమ శాఖల స్టడీసర్కిళ్లు ఈయన సేవలను అందుకుంటున్నాయి. తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో రూపొందిన ప్రత్యేక సంచిక తెలుగు జర్నల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలంగాణ రాష్ట్ర పురోగతిని వీరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టికల్ ప్రచురించారు. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పలు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, బిట్బ్యాంకులు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను పుస్తకాల రూపంలో విద్యార్థులకు అందించారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూనే తెలంగాణ విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో దశాబ్దకాలం పాటు రూపొందిన పలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాల ద్వారా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రిసోర్సుపర్సన్గా పనిచేసి ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉపాధ్యాయ నియామకాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టీశాట్ ఛానల్స్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన వీడియో క్లాసుల్లో వీరి ప్రసంగాలు ఆదరణ పొందాయి.
అందుకున్న పురస్కారాలు
- ఈ ఏడాది జనవరి 26, 27 తేదీల్లో ఆన్లైన్ మాధ్యమంగా జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్సులో పాల్గొని ప్రతిభ చూపినందుకు కాంపిటెన్సీ నావిగేటర్ జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు. వైజాగ్ సిధ్వీ ఫౌండేషన్, పుదుచ్చేరి డివైన్మదర్ కాలేజీ సంయుక్తంగా ఈ అవార్డును అందజేశాయి.
- జాతీయ స్థాయిలో విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే కైట్స్ క్రాఫ్ట్స్ సంస్థ నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సు అవార్డు-2023 అందించింది.
- ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎడ్యుకేషన్ పర్యటనలు నిర్వహించే ఏకేఎన్ వరల్డ్వైడ్ సంస్థ గ్లోబల్ టీచర్ అవార్డు-2023ను అందించింది.
- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2022లో ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేసే ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించే అక్షర ఫౌండేషన్ అక్షర జాతీయ పురస్కారం అందించింది.
- తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించే పుడమి సాహితీ వేదిక పుడమి విద్యారత్న-2022 జాతీయ పురస్కారాన్ని అందజేసింది.
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి సమితి ఈయనకు తెలుగుతేజం పురస్కారం-2022 అందజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగ సంఘ నేతలు
[ 07-05-2024]
జిల్లా జేఏసి ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షుడు డి.భగత్, ఉద్యోగ సంఘం నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు
[ 07-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
[ 07-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!
[ 07-05-2024]
భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. -
సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
[ 07-05-2024]
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. -
ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
[ 07-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. -
మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
[ 07-05-2024]
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు. -
అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్ అభ్యర్థి
[ 07-05-2024]
చౌటుప్పల్ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు -
రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
[ 07-05-2024]
‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. -
సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
[ 07-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య