logo

అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతిచెందిన ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Published : 09 Feb 2023 03:22 IST

శివ

మాడ్గులపల్లి(వేములపల్లి), న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతిచెందిన ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అద్ధంకి-నార్కట్‌పల్లి రహదారిపై శెట్టిపాలెం శివార్లో బుధవారం బల్లాపై గుర్తు తెలియని బాలుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాలుడి ఫొటోను సోషల్‌మీడియా గ్రూపుల్లో పెట్టారు. వాటిని చూసిన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన రాసమళ్ల లింగస్వామి, సీతమ్మలు... మృతిచెందిన బాలుడు తమ చిన్న కూమారుడు రాసమళ్ల శివ(15)గా  చెప్పారు. శివ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారమే సమీప బంధువుల స్కూటీ తీసుకొని సరదాగా సాగర్‌ ఎడమ కాల్వ వైపు వెళ్లాడని, రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదని వాపోయారు. అతని ఆచూకీ కోసం బంధువులను ఆరా తీశామన్నారు.అంతలో ఈ విషాదాన్ని చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి లింగస్వామి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నరసింహ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని