కాంగ్రెస్ గూటికి మోత్కుపల్లి, నేతి విద్యాసాగర్
మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్లో చేరారు.
ఆలేరు, న్యూస్టుడే: మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్లో చేరారు. దిల్లీలో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నుంచి ఐదు సార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెదేపాను వీడి 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2009లో మళ్లీ తెదేపాలో చేరి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు సంవత్సరాల క్రితం భాజపాలో చేరారు. దళితబంధు ఒక మహోన్నతమైన పథకం అని కేసీఆర్ను కీర్తిస్తూ ఏడాదిన్నర క్రితం భారాసలో చేరారు. ప్రభుత్వ పరంగా మంచి పదవి వస్తుందని ఆశించారు. ఆశ నెరవేరకపోవడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. టికెట్ను ఇచ్చేందుకు భారాస అధిష్ఠానం సుముఖత చూపకపోవడంతో కొద్ది రోజులుగా భారాస నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. చివరకు కాంగ్రెస్లో చేరారు.
నకిరేకల్, న్యూస్టుడే: శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, భారాస నాయకుడు నేతి విద్యాసాగర్, నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, బీజీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ బచ్చుపల్లి గంగాధర్రావు శుక్రవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దాదాపు రెండేళ్ల నుంచి భారాస నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విద్యాసాగర్ సొంత గూటికి చేరినట్లయింది. నేతిని బుజ్జగించేందుకు మంత్రి జగదీశ్రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆయన్ను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. 2007, 2009లో కాంగ్రెస్ నుంచి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011 జూన్లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2014లో మండలి విభజన సమయంలో కాంగ్రెస్ నుంచి తెరాస(నేటి భారాస)లో చేరారు. 2015లో తెరాస నుంచి ఎమ్మెల్యేల కోటాలో మూడోసారి ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2021 జూన్లో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్
[ 17-05-2024]
భువనగిరి పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రాలో కేటాయించిన లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ ప్రతినిధి వర్గం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
[ 17-05-2024]
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?